Webdunia - Bharat's app for daily news and videos

Install App

గర్భందాల్చిన బాలిక... కాన్పు చేసిన హాస్టల్ సిబ్బంది... కిటికీలోనుంచి పసికందును విసిరిపారేస్తూ...

విజయనగరం జిల్లా ప్రభుత్వ బాలికల వసతి గృహంలో నివసించే ఓ బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలికకు ఎవరు గర్భం చేశారో తెలియదు కానీ.. ఆ బాలికకు కాన్పు మాత్రం హాస్టల్ సహాయక సిబ్బంది చేశారు.

Webdunia
సోమవారం, 14 ఆగస్టు 2017 (13:04 IST)
విజయనగరం జిల్లా ప్రభుత్వ బాలికల వసతి గృహంలో నివసించే ఓ బాలిక ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బాలికకు ఎవరు గర్భం చేశారో తెలియదు కానీ.. ఆ బాలికకు కాన్పు మాత్రం హాస్టల్ సహాయక సిబ్బంది చేశారు. ఆ తర్వాత పసికందును కిటికీలోనుంచి బయటపడేస్తూ చిక్కిపోయారు. జిల్లాలో కలకలం రేపిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఉంటూ చదువుకునే ఓ బాలిక గర్భందాల్చింది. ఈ గర్భానికి కారణం ఎవరో తెలియదు. కానీ, ఆ హస్టల్ విద్యార్థిని గర్భం దాల్చడంతో వసతిగృహ సిబ్బంది, అధికారులు గుట్టుచప్పుడుకాకుండా కాన్పు చేయించారు. కాన్పు తర్వాత పసిబిడ్డను హాస్టల్ కిటికీలోనుంచి బయటకు విసిరేసే సమయంలో అటుగా వెళ్ళిన వ్యక్తి ఈ సమాచారాన్ని పోలీసులకు చేరవేశాడు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు. 
 
ఈ విషయం తెలుసుకొన్న జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తీవ్రంగా స్పందించారు. హస్టల్ సంక్షేమాధికారి విజయనిర్మలను సస్పెండ్ చేశారు. సాంఘిక సంక్షేమశాఖ జిల్లా సహయాధికారి శశిభూషణ్‌ను సస్పెండ్ చేయాలని రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులకు ఆయన సిఫారసు చేశారు. హస్టల్ వాచ్‌ఉమెన్‌ను విధుల నుంచి తొలగించారు. అలాగే, బాలిక గర్భందాల్చిన వ్యవహారంపై విచారణకు ఆదేశించారు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments