Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ రక్షణ కోసం రాజశ్యామల అనుగ్రహం పొందండి: స్వాత్మానందేంద్ర స్వామి

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (07:20 IST)
దేశ రక్షణ కోసం జగన్మాత రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం పొందాలని రక్షణ శాఖ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ(డీఆర్ డీఓ) ఛైర్మన్ సతీష్ రెడ్డికి విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి సూచించారు.

పూర్వకాలంలో రాజులు యుద్ధానికి వెళ్ళే ముందు రాజశ్యామల అమ్మవారికి పూజలు చేసి సత్ఫలితాలను సాధించేవారని తెలిపారు. లోకాలను పాలించే రాజమాతంగిగా అమ్మవారు పూజలందుకుంటున్నారని వివరించారు. ఈరోజు ఢిల్లీలో స్వాత్మానందేంద్ర స్వామి డీఆర్ డీఓ ఛైర్మన్ సతీష్ రెడ్డి నివాసానికి వెళ్ళి ఆశీస్సులు అందించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ దేశంతో పాటు దేశ ప్రజల రక్షణకు సైతం డీఆర్ డీఓ కట్టుబడి ఉందన్నారు. కరోనా ఆపత్కాలంలో ఇమ్యూనిటీ పెంచే 2 - డీ పౌడరును తయారు చేసామని, దేశవ్యాప్తంగా వేయి(1000) ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు.

ఇప్పటికే పదివేల ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేసి సేవలందించామని స్వామీజీకి వివరించారు. తన హయాంలో రాడార్, క్షిపణి వ్యవస్థలను అత్యాధునికంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. రాజశ్యామల అనుగ్రహంతో మరింత పటిష్టంగా రక్షణ శాఖను తీర్చిదిద్దాలని ఛైర్మన్ సతీష్ రెడ్డికి స్వాత్మానందేంద్ర స్వామి ఆశీస్సులు అందించారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments