Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశ రక్షణ కోసం రాజశ్యామల అనుగ్రహం పొందండి: స్వాత్మానందేంద్ర స్వామి

Webdunia
గురువారం, 23 సెప్టెంబరు 2021 (07:20 IST)
దేశ రక్షణ కోసం జగన్మాత రాజశ్యామల అమ్మవారి అనుగ్రహం పొందాలని రక్షణ శాఖ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ(డీఆర్ డీఓ) ఛైర్మన్ సతీష్ రెడ్డికి విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి సూచించారు.

పూర్వకాలంలో రాజులు యుద్ధానికి వెళ్ళే ముందు రాజశ్యామల అమ్మవారికి పూజలు చేసి సత్ఫలితాలను సాధించేవారని తెలిపారు. లోకాలను పాలించే రాజమాతంగిగా అమ్మవారు పూజలందుకుంటున్నారని వివరించారు. ఈరోజు ఢిల్లీలో స్వాత్మానందేంద్ర స్వామి డీఆర్ డీఓ ఛైర్మన్ సతీష్ రెడ్డి నివాసానికి వెళ్ళి ఆశీస్సులు అందించారు.

ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ దేశంతో పాటు దేశ ప్రజల రక్షణకు సైతం డీఆర్ డీఓ కట్టుబడి ఉందన్నారు. కరోనా ఆపత్కాలంలో ఇమ్యూనిటీ పెంచే 2 - డీ పౌడరును తయారు చేసామని, దేశవ్యాప్తంగా వేయి(1000) ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నామన్నారు.

ఇప్పటికే పదివేల ఆక్సిజన్ పడకలను ఏర్పాటు చేసి సేవలందించామని స్వామీజీకి వివరించారు. తన హయాంలో రాడార్, క్షిపణి వ్యవస్థలను అత్యాధునికంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. రాజశ్యామల అనుగ్రహంతో మరింత పటిష్టంగా రక్షణ శాఖను తీర్చిదిద్దాలని ఛైర్మన్ సతీష్ రెడ్డికి స్వాత్మానందేంద్ర స్వామి ఆశీస్సులు అందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

తర్వాతి కథనం
Show comments