Webdunia - Bharat's app for daily news and videos

Install App

త్వరలోనే టీడీపీలోకి భారీ వలసలు : గంటా శ్రీనివాస రావు

Webdunia
బుధవారం, 20 ఏప్రియల్ 2022 (13:28 IST)
టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాస రావు చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. అధికార వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి భారీగానే వలసలు ఉంటాయంటూ వ్యాఖ్యానించారు. ఇవి ఇపుడు అధికార వైకాపాలో కాక రేపుతున్నాయి. 
 
రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత గంటా శ్రీనివాస రావు సైలెంట్ అయిపోయారు. ఒక దశలో ఆయన పార్టీ మారబోతున్నారంటూ ప్రచారం సాగింది. కానీ, ఆయన పార్టీ మారలేదుగానీ సైలెంట్‌గా ఉండిపోయారు. 
 
అయితే, ఇటీవల జగన్ చేపట్టిన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణతో వైకాపాలో లుకలుకలు వెలుగు చూశాయి. అనేక మంది నేతలు అధిష్టానంపై తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. మరికొందరు మళ్లీ టీడీపీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. 
 
ఇలాంటి తరుణంలో గంటా శ్రీనివాస రావు చేసిన వ్యాఖ్యలు ఇపుడు అత్యంత కీలకంగా మారాయి. ఇటీవల పార్టీ కార్యాలయానికి వెళ్లి ప్రెస్మీట్ పెట్టారు. కొన్ని కీలక పాయింట్స్‌ను టచ్ చేశారు. సీఎం జగన్ చేపట్టిన రివ్యూ సమావేశానికి సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ ఎందుకు హాజరుకాలేదంటూ ప్రశ్నించారు. 
 
అంతేకాకుండా, విశాఖను రాజధాని చేస్తామని చెప్పిన సీఎం జగన్.. విశాఖ జిల్లాకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని గంటా ప్రశ్నించారు. త్వరలోనే వైకాపా నుంచి భారీగా వలసలు ఉంటాయని ఆయన జోస్యం చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments