Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ కుటుంబానికి మోడీ సర్కారు షాక్... ఇది ప్రతీకార చర్యేనంటున్న కాంగ్రెస్

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (17:49 IST)
గాంధీ కుటుంబానికి ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు తేరుకోలేని షాకిచ్చింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలకు కల్పిస్తూ వచ్చిన ఎస్.పి.జి. (స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) భద్రతను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. 
 
ప్రస్తుతం వారికున్న ఎస్‌పీజీ భద్రతను ఉపసంహరించి, జడ్ ప్లస్ కేటిగిరి భద్రత కల్పించనున్నట్టు ప్రభుత్వ వర్గాల తాజా సమాచారం. ప్రధాని, రాష్ట్రపతికి మాత్రమే ఎస్‌పీజీ భద్రత ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు ఎస్‌పీజీ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. 
 
మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇదే అంశంపై ఆ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ స్పందిస్తూ, కేంద్రం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. గాంధీల ప్రాణాలతో కేంద్రం రాజీ పడుతోందన్నారు. ఎస్‌పీజీ భద్రత తొలగించడం వల్ల గాంధీ కుటుంబ సభ్యులను తేలికగా టార్గెట్ చేసే అవకాశాలుంటాయని, వారు ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments