Webdunia - Bharat's app for daily news and videos

Install App

గాంధీ కుటుంబానికి మోడీ సర్కారు షాక్... ఇది ప్రతీకార చర్యేనంటున్న కాంగ్రెస్

Webdunia
శుక్రవారం, 8 నవంబరు 2019 (17:49 IST)
గాంధీ కుటుంబానికి ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు తేరుకోలేని షాకిచ్చింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీలకు కల్పిస్తూ వచ్చిన ఎస్.పి.జి. (స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్) భద్రతను తొలగించాలని నిర్ణయం తీసుకుంది. 
 
ప్రస్తుతం వారికున్న ఎస్‌పీజీ భద్రతను ఉపసంహరించి, జడ్ ప్లస్ కేటిగిరి భద్రత కల్పించనున్నట్టు ప్రభుత్వ వర్గాల తాజా సమాచారం. ప్రధాని, రాష్ట్రపతికి మాత్రమే ఎస్‌పీజీ భద్రత ఉంటుందని తెలుస్తోంది. ఈ మేరకు ఎస్‌పీజీ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం. 
 
మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఇదే అంశంపై ఆ పార్టీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ స్పందిస్తూ, కేంద్రం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. గాంధీల ప్రాణాలతో కేంద్రం రాజీ పడుతోందన్నారు. ఎస్‌పీజీ భద్రత తొలగించడం వల్ల గాంధీ కుటుంబ సభ్యులను తేలికగా టార్గెట్ చేసే అవకాశాలుంటాయని, వారు ప్రాణాలకు ముప్పు ఉంటుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒకవైపు సమంతకు రెండో పెళ్లి.. మరోవైపు చైతూ-శామ్ ఆ బిడ్డకు తల్లిదండ్రులు.. ఎలా?

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments