Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖలో భారీ వర్షం: మట్టిపెళ్లలు, గోడ విరిగిపడి నలుగురు మృతి!

Webdunia
గురువారం, 18 సెప్టెంబరు 2014 (16:53 IST)
విశాఖ నగరంలో కురిసిన భారీ వర్షం నలుగురు వలస కార్మికుల దుర్మరణానికి కారణమైంది. ఈ వర్షానికి తడిసిన ఓ ప్రహారీ గోడ కూలడంతో పాటు మట్టి పెళ్లలు విరిగిపడటంతో దాని పక్కనే పని చేస్తున్న ఆరుగురు కూలీలు మట్టి పెళ్లల కింద చిక్కుకుని మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదం గురువారం ఉదయం జరిగిన ఈ ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. 
 
విశాఖపట్నంలోని సిరిపురం టైకూన్ హోటల్ సమీపంలో నిర్మాణం జరుగుతున్న ఓ భవన ప్రహారీ గోడ కూలింది. గోడతో పాటు భారీగా మట్టి పెళ్లలు కూలాయి. శిథిలాల కింద పడి నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. నలుగురు మృతులను బయటికి తీశారు. గురువారం ఉదయం 10 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 
 
10 అడుగుల లోతు ఉన్న గుంతలో ఆరుగురు కార్మికులు పని చేస్తుండగా ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా ప్రహారీగోడ, దాని కింద ఉన్న మట్టిపెళ్లలు కుప్పకూలిపోయాయి. వీటి కింద చిక్కుకున్న నాలుగు మృతదేహాలను శిథిలాల నుంచి వెలికి తీశారు. మృతులను కృష్ణ, రాము, పరదేశ్, సోమేష్‌లుగా గుర్తించారు. అపార్ట్‌మెంట్ నిర్మాణ పనుల్లో భాగంగా ప్రహారీ గోడకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా పనులు చేపట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments