Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడపలో ఘోర రోడ్డు ప్రమాదం, నలుగురు ఎర్ర చందనం స్మగ్లర్లు సజీవ దహనం

Webdunia
సోమవారం, 2 నవంబరు 2020 (11:43 IST)
కడప శివారు విమానశ్రయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో నలుగురు ఎర్ర చందనం స్మగ్లర్లు సజీవదహనమయ్యారు. వివరాల ప్రకారం తమిళనాడుకు చెందిన స్మగ్లర్లు పోలీసుల కళ్లు గప్పి అక్రమ మార్గంలో ఎర్ర చందనం తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
 
కడప శివారు గోటూరు వద్ద స్మగ్లర్లకు చెందిన రెండు కార్లు టిప్పర్‌ను ఢీకొన్నాయి. తెల్లవారు జామున 3 నుంచి 4 గంటల మధ్య టిప్పర్ రోడ్డు మలుపు తిరిగుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మొదటి కారు ఢీకొన్న క్షణాల్లో వెనుక వస్తున్న స్కార్పియో టిప్పర్ డీజల్ ట్యాంక్‌ను ఢీకొట్టింది.
 
డీజల్ ట్యాంక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి ఎర్ర చందనంతో ఉన్న రెండో కారులో ఉన్న నలుగురు సజీవ దహనం అయ్యారు. మొదటి కారులో ఉన్న ముగ్గురు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు. స్మగ్లర్లు కడప నుంచి తాడిపత్రి వైపు ప్రయాణి స్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.
 
ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. మృత దేహాలు గుర్తుపట్టలేని విధంగా మారడంతో వారి వివరాలను తెలుసుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వారంతా తమిళనాడు వాసులుగా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రెండో పెళ్లి చేసుకున్న నటి... ప్రియుడుతో కలిసి మూడుముళ్ల బంధంలోకి...

అలాంటి పాత్రలు చేయను.. అవసరమైతే ఆంటీగా నటిస్తా : టాలీవుడ్ నటి

యాంకర్ రష్మీకి మైనర్ సర్జరీ.. అభిమానుల పరేషాన్!!

రాజ్ తరుణ్ - లావణ్య కేసులో సరికొత్త ట్విస్ట్.. సంచలన వీడియో రిలీజ్

అసభ్యకర పోస్టులు : పోలీసుల విచారణకు హాజరైన శ్రీరెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments