Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ నుంచి కొత్తగా నాలుగు విమానసర్వీసులు

Webdunia
బుధవారం, 23 అక్టోబరు 2019 (20:49 IST)
విజయవాడ నుంచి ఒకేరోజు నాలుగు విమాన సర్వీసులు కొత్తగా ప్రారంభమవుతున్నాయి. ఊ నెల 27 నుంచి ఈ సర్వీసులు నడిపేందుకు పౌరవిమానశాఖ నిర్ణయించింది. తిరుపతికి , విశాఖతో పాటు హైదరాబాద్‌కు రెండు కొత్త విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ జి.మధుసూదనరావు తెలిపారు.

ఈ నెల 27 న విజయవాడ నుంచి 4 విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయ డైరెక్టర్ జి.మధుసూదనరావు తెలిపారు. తిరుపతి, విశాఖలతో పాటు హైదరాబాద్‌కు రెండు విమాన సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.

తిరుపతి-విజయవాడ మధ్య రానున్న ఎయిర్ బస్ వారానికి మూడు రోజులు అందుబాటులో ఉంటుందన్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు స్పైస్ జెట్, ఇండిగో విమాన సర్వీసులు ప్రారంభమవుతాయన్నారు. విజయవాడ-విశాఖ విమాన సర్వీసు తిరిగి పునరుద్ధరిస్తామన్నారు. విజయవాడ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం సహా సివిల్ ఏవియేషన్‌కు లేఖలు రాశామని... అంతర్జాతీయ విమానాలు నడిచేందుకు మరింత సమయం పడుతుందని అన్నారు. జూలై 2020 నుంచి హజ్ విమానాలు విజయవాడ నుంచే నేరుగా బయలుదేరతాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బకాసుర రెస్టారెంట్‌ నుంచి సాంగ్‌ను ఆవిష్కరించిన హరీశ్‌ శంకర్‌

తెలుగు సాహిత్యం, వాడుక భాష‌మీదా పట్టుున్న హాస్య‌బ్రహ్మ’ జంధ్యాల

తన పేరుతో ఉన్న పులిని కలిసిన రామ్ చరణ్, ఉపాసన కొణిదెల కుమార్తె క్లీంకార

Surya: సూర్య, ఆర్జే బాలాజీ సినిమా టైటిల్ కరుప్పు లుక్ రిలీజ్

బడ్‌ఎక్స్ NBA హౌస్ సెలబ్రిటీ గేమ్‌లో పాల్గొన్న ఏకైక స్టార్‌గా అరవింద్ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

ప్రోటీన్ పోషకాలున్న కాలిఫోర్నియా బాదంతో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుక చేసుకోండి

తర్వాతి కథనం
Show comments