Webdunia - Bharat's app for daily news and videos

Install App

తానా మాజీ అధ్యక్షుడు డాక్టర్ గొర్రెపాటి నవనీత కృష్ణ మృతి

Webdunia
శుక్రవారం, 25 అక్టోబరు 2019 (17:17 IST)
తానా మాజీ అధ్యక్షుడు, ఘంటసాలకు చెందిన ఎన్నారై డాక్టర్ గొర్రెపాటి నవనీత కృష్ణ(73) అమెరికాలో గురువారం మృతి చెందారు. గొర్రెపాటి విద్యా ట్రస్టు ఛైర్మన్ ఎన్నారై గొర్రెపాటి రంగనాథ బాబుకు ఆయన స్వయానా సోదరుడు. ఘంటసాలలో జరిగిన ప్రతి అభివృద్ధికి ఆయన ఎంతో సాయం చేసేవారు. 
 
ఏడేళ్ల క్రితం ఘంటసాలలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీరామారావు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రముఖ సినీ హీరో నందమూరి బాలకృష్ణతో ఆవిష్కరింపజేశారు. గత పదేళ్లుగా గంటసాలలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా రాష్ట్ర స్థాయి పశు ప్రదర్శన పోటీలు నిర్వహింపచేసారు. 
 
ఇబ్రహీంపట్నంలో పది ఎకరాల స్థలాన్ని తెదేపా ప్రభుత్వ హయాంలో కొనుగోలు చేసి కొంత మంది ఎన్నారై డాక్టర్‌లతో కలిసి రూ.600 కోట్లతో బడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడేలా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 
 
డాక్టర్ నవనీత కృష్ణ అంతక్రియలు అమెరికాలో జరుగుతాయని బంధువులు తెలిపారు. ఆయన మృతికి తెదేపా నేతలు తుమ్మల చౌదరి బాబు గొర్రెపాటి వెంకట రామకృష్ణ వైకాపా నేత వేమూరి ప్రసాద్ తదితరులు సంతాపం తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

ఆరెంజ్ చీరలో దిశా పటానీ అందాలు అదరహో.. (ఫోటోలు)

ఆనంది, వరలక్ష్మిశరత్‌కుమార్ థ్రిల్లర్ శివంగి ఆహా లో స్ట్రీమింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

వేసవి కాలంలో రాత్రిపూట స్నానం చేయడం మంచిదా?

తర్వాతి కథనం
Show comments