Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయవాడ నుంచి గల్ఫ్ విమాన సర్వీసులు పున:ప్రారంభం

Webdunia
గురువారం, 3 జూన్ 2021 (12:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య రాజధాని విజయవాడ గన్నవరం నుంచి గల్ఫ్ దేశాలకు విమాన సేవలు పునఃప్రారంభమయ్యాయి. విజయవాడకు విదేశీ విమాన సర్వీసులు మస్కట్, సింగపూర్, కువైట్ తదితర దేశాల నుంచి విమానాలు వచ్చేందుకు అనుమతించారు. 
 
బుధవారం సాయంత్రం 6.10 గంటలకు 65 మందితో దుబాయ్ విమానం ఇక్కడికి చేరుకోనుంది. విజయవాడకు ఒక్క ఆదివారం మినహాయించి వారానికి 10 విదేశీ విమాన సర్వీసులు రానున్నాయి. కరోనా రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో ఏప్రిల్ 3 నుంచి విదేశీ సర్వీసులు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
 
వందే భారత్ మిషన్‌లో భాగంగా రానున్న విదేశీ విమాన సర్వీసుల కోసం గన్నవరం ఎయిర్ పోర్టులో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వందేభారత్ మిషన్‌లో భాగంగా విదేశీ విమాన సర్వీసులు అక్టోబరు వరకు కొనసాగనున్నాయి. 18 దేశాల నుంచి ఇప్పటిదాకా 56,038 మంది ప్రవాసులు ఏపీకి చేరుకున్నారు. వీరిలో కువైట్ నుంచి రాష్ట్రానికి వచ్చినవారే 29,356 మంది ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

చిత్రపురి కాలనీ స్థలం ఉచితంగా రాలేదు.. ఆరోపణలు చేసే వారికి ఏం తెలుసు?

FISM 2025: సుహానీ షా రికార్డ్: ఉత్తమ మ్యాజిక్ క్రియేటర్ అవార్డు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments