Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్థులకు అస్వస్థత

Webdunia
శుక్రవారం, 6 మార్చి 2015 (09:56 IST)
విద్యార్థులు కొందరు కలుషిత ఆహారం తీసుకోవడంతో అస్వస్థతకు గురయ్యారు. చెడిపోయాన పప్పు ఆహారం తీసుకోవడంతో విద్యార్థులు వాంతులు, విరేచనాలు అయి ఆసుపత్రి పాలయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన సంఘటన వివరాలిలా ఉన్నాయి. 
 
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం పోతవరం గిరిజన బాలుర సంక్షేమ ఆశ్రమ వసతిగృహంలో కలుషితాహారం వల్ల 30 మంది విద్యార్థులు గురువారం భోజనం చేశారు. భోజనంలోకి పప్పు, క్యాబేజీ, కోడిగడ్డు వడ్డించారు. అయితే అవి అప్పటికే కలుషితమయ్యాయి. దీంతో కొంత మంది విద్యార్థులు వాంతులు విరేచనాలతో తల్లడిల్లి పోయారు.
 
హాస్టల్‌లో ఉన్న 60 మంది విద్యార్థుల్లో కొందరు కడుపునొప్పితో బాధపడగా, మరికొందరు కళ్లు తిరిగి పడిపోయారు. దీంతో స్థానికంగా ప్రథమ చికిత్స అనంతరం 28 మందిని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాడైన కోడిగుడ్లు వండడమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కలెక్టర్ అరుణ్‌కుమార్ విద్యార్థులను పరామర్శించారు.
 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments