Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రముఖ వాగ్గేయకారుడు, ఉత్తరాంధ్ర గద్దర్ ఇకలేరు

Webdunia
మంగళవారం, 4 ఆగస్టు 2020 (08:51 IST)
ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు ఇకలేరు. "ఏం పిల్లడో ఎల్దమొస్తవా.." అంటూ ప్రజల్లో చైతన్యం నింపిన ప్రజాగాయకుడు వంగపండు ప్రసాదరావు. విజయనగరం జిల్లా పెదబొండపల్లికి చెందిన వంగపండు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చారు. ఆయన ఆరోగ్యం విషమించడంతో మంగళవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 
 
1943లో జ‌న్మించిన వంగ‌పండు ఉత్తరాంధ్ర గద్దర్‌గా పేరుగాంచారు. 1972లో  జననాట్య మండలిని స్థాపించిన వంగపండు తన గేయాలతో గిరిజనులను చైతన్య పరిచే ప్రయత్నం చేశారు. వందలాది జానపదాలకు ప్రాణం పోసిన ఆయనకు 2017లో కళారత్న పురస్కారం లభించింది. 
 
వంగపండు మృతి విషయం తెలిసిన వెంటనే విప్లవకవి గద్దర్ స్పందించారు. ఆయనది పాట కాదని, అది ప్రజల గుండె చప్పుడు అని కొనియాడారు. అక్షరం ఉన్నంత వరకు ఆయన జీవించి ఉంటారని అన్నారు. పాటను ప్రపంచంలోకి తీసుకెళ్లిన గొప్ప వ్యక్తి వంగపండు అని ప్రశంసించారు.
 
త‌న జీవిత కాలంలో వంద‌ల పాట‌ల‌కు ఆయ‌న గ‌జ్జెక‌ట్టారు. 1972లో జ‌న‌నాట్య మండ‌లిని స్థాపించిన వంగ‌పండు త‌న గేయాల‌తో బ‌డుగుబ‌ల‌హీన వ‌ర్గాల‌ను, గిరిజ‌నుల‌ను చైత‌న్య ప‌రిచారు. 2017లో క‌ళార‌త్న పుర‌స్కారాన్ని అందుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments