Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు... నేటి నుంచీ ఐదేళ్ళ పదవీకాలం

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (12:19 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో తాజాగా ఎంపీటీసీ సభ్యులుగా గెలిచిన వారి పదవీ కాలం శుక్రవారం నుంచి, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం శనివారం నుంచి ప్రారంభమై ఐదేళ్ల పాటు కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలంసాహ్ని ఈ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 2020 మార్చి 7వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేయగా, పోలింగ్‌ 2021 ఏప్రిల్‌ 8న, కౌంటింగ్‌ ప్రక్రియ సెప్టెంబర్‌ 19వ తేదీన ముగిశాయి.
 
మధ్యలో 2020 మార్చిలో 2,371 మంది ఎంపీటీసీ సభ్యులుగా, 126 మంది జెడ్పీటీసీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారి పదవీ కాలం కూడా ఇదీ రీతిలో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయ అధికారులు స్పష్టం చేశారు.
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో దాదాపు అత్య‌ధిక జెడ్పీల‌ను, మండ‌లాల‌ను వైసీపీ కైవ‌శం చేసుకుంది. మెజారిటీ సీట్లు ఎక్కువ‌గా వైసీపీకి రావ‌డంతో ఎక్క‌డా కూడా మండ‌లాధ్య‌క్ష‌, జెడ్పీ పీఠాల కోసం కుమ్ములాట‌లు లేవు. ముఖ్యంగా టీడీపీ, వైసీపీల మ‌ధ్య మెజారిటీ తేడా ఎక్కువ‌గా ఉండ‌టంతో అంతా స‌జావుగా సాగిపోయింది.

సంబంధిత వార్తలు

ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయిన వారిని ఫెయిల్యూల్ నటులు అంటారు : వితిక సందేశ్

ఆడువారు మాటలకు అర్థాలే వేరులే - వర్మ మాటలు నీటిమూటలేనా !

పొన్నం ప్రభాకర్ క్లాప్ తో శ్రీకారం చుట్టుకున్న నిమ్మకూరు మాస్టారు

వరుణ్ సందేశ్‌ కు ‘నింద’ మైల్ స్టోన్‌లా మారాలి : నిఖిల్ సిద్దార్థ్

క్లిన్ కారా కోసం షూటింగ్ షెడ్యూల్ ను మార్చుకుంటున్న రామ్ చరణ్

మీరు తెలుసుకోవలసిన ప్రతి సాధారణ వాస్కులర్ ప్రొసీజర్‌లు, శస్త్రచికిత్సల గురించి

కిడ్నీలు చెడిపోతున్నాయని తెలిపే సంకేతాలు ఇలా వుంటాయి

దోరగా వేయించిన ఉల్లిపాయలు తినడం వల్ల లాభాలు ఏమిటి?

నువ్వుల నూనెతో శరీర మర్దన చేస్తే ఆరోగ్యమేనా?

మెదడు శక్తిని పెంచే ఆహారం ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments