Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులకు... నేటి నుంచీ ఐదేళ్ళ పదవీకాలం

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (12:19 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో తాజాగా ఎంపీటీసీ సభ్యులుగా గెలిచిన వారి పదవీ కాలం శుక్రవారం నుంచి, జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం శనివారం నుంచి ప్రారంభమై ఐదేళ్ల పాటు కొనసాగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలంసాహ్ని ఈ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు 2020 మార్చి 7వ తేదీన నోటిఫికేషన్‌ జారీ చేయగా, పోలింగ్‌ 2021 ఏప్రిల్‌ 8న, కౌంటింగ్‌ ప్రక్రియ సెప్టెంబర్‌ 19వ తేదీన ముగిశాయి.
 
మధ్యలో 2020 మార్చిలో 2,371 మంది ఎంపీటీసీ సభ్యులుగా, 126 మంది జెడ్పీటీసీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారి పదవీ కాలం కూడా ఇదీ రీతిలో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యాలయ అధికారులు స్పష్టం చేశారు.
 
ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో దాదాపు అత్య‌ధిక జెడ్పీల‌ను, మండ‌లాల‌ను వైసీపీ కైవ‌శం చేసుకుంది. మెజారిటీ సీట్లు ఎక్కువ‌గా వైసీపీకి రావ‌డంతో ఎక్క‌డా కూడా మండ‌లాధ్య‌క్ష‌, జెడ్పీ పీఠాల కోసం కుమ్ములాట‌లు లేవు. ముఖ్యంగా టీడీపీ, వైసీపీల మ‌ధ్య మెజారిటీ తేడా ఎక్కువ‌గా ఉండ‌టంతో అంతా స‌జావుగా సాగిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను-కీర్తన తో చిమటా రమేష్ బాబు విజయభేరి మ్రోగించాలి : మురళీమోహన్

15 కోట్లతో మట్కా చిత్రం కోసం ఫిలింసిటీలో వింటేజ్ వైజాగ్ సెట్‌

ప్రపంచ వ్యాప్తంగా కమ్ముకున్న "కల్కి" ఫీవర్

రాజమౌళి దంపతులకు అరుదైన గౌరవం... ఆహ్వానం కూడా...!!

కథంతా చెప్పేసిన థీమ్ ఆఫ్ క‌ల్కి లిరిక‌ల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments