Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పకూలిన చర్చి: ఐదుగురు క్రైస్తవులు మృతి!

Webdunia
సోమవారం, 13 ఏప్రియల్ 2015 (14:09 IST)
చర్చి కుప్పకూలడంలో ఐదుగురు క్రైస్తవులు ప్రాణాలు కోల్పోయారు. ప్రార్థనలు చేస్తున్న సమయంలో కుప్పకూలిపోవడంతో పలువురికి తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఆగ్నేయ నైజీరియాలో ఈ సంఘటన జరిగింది.

ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో ఎనుగు రాష్ట్రంలోని ఓడుమా పట్టణంలో సెయింట్ ఆంథోణి చర్చిలో క్రైస్తవులు ప్రార్థనలు చెయ్యడానికి వెళ్లారు. అర్దగంట తరువాత చర్చి ఒక్క సారిగా కుప్పకూలిపోయిందని పోలీసులు తెలిపారు. 
 
చర్చి కూలిపోయే సమయంలో క్రైస్తవులు ప్రార్థనలు చేస్తున్నారని ఇసాక్ ఎంబా పోలీసులకు తెలిపాడు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రులకు తరలించారు. శిథిలాల నుండి మృతదేహాలు బయటకు తియ్యడానికి నానా ఇబ్బంది పడ్డారు.

గత వారం రోజుల నుండి ఎనుగు రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షాల కారణంగానే చర్చి కూలిపోయిందని పోలీసు అధికారుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగుచూసింది. అయినప్పటికీ విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments