Webdunia - Bharat's app for daily news and videos

Install App

అలీని అలా సర్దేశారు.. ఇప్పటికే ఇద్దరు కృష్ణులు.. ఇపుడు మూడో కృష్ణుడుగా హాస్య నటుడు

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2022 (11:17 IST)
తెలుగు హాస్య నటుడు అలీని వైకాపా అధినేత, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలా సర్దేశారు. ఇప్పటికే మీడియాకు ఇద్దరు సలహాదారులు ఉన్నారు. ఇపుడు మూడో సలహాదారుడుగా అలీని నియమించారు. నిజానికి వైకాపా సభ్యత్వం తీసుకున్న అలీని రాజ్యసభకు పంపిస్తారని, ఎమ్మెల్సీ చేస్తారనీ, మైనారిటీ కమిషన్ ఛైర్మన్ చేస్తారంటూ జోరుగా ప్రచారం సాగింది. కానీ, వీటిలో ఏ ఒక్కటీ ఇవ్వకుండా గుట్టుచప్పుడు కాకుండా, ఒక సలహాదారు పోస్టు ఇచ్చి అలా సరిపుచ్చారు. 
 
నిజానికి గతంలో సీఎం జగన్‌ను తన సతీమణితో కలిసిన అలీ... ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, త్వరలోనే మంచి రోజు వస్తుంది అని తనకు సీఎం చెప్పారని వెల్లడించారు. దీంతో అలీని రాజ్యసభకు పంపిస్తారని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ, అది నిజం కాలేదు. 
 
ఆ తర్వాత రెండు రోజులకు అలీని మైనారిటీ కమిషన్ ఛైర్మన్‌గా నియమిస్తారంటూ ప్రభుత్వ వర్గాలు లీకులు ఇచ్చారు. అలీకి ఆ పదవి కూడా లభించలేదు. చివరకు ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు, మూడో కృష్ణుడు తరహాలో ఇప్పటికే ఇద్దరు మీడియా సలహాదారులుండగా, మరో సలహాదారుగా అలీని నియమించడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments