Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్‌లో మరో టెక్కీ భరణి అదృశ్యం.. ఈ కథేంటో?

Webdunia
శనివారం, 1 నవంబరు 2014 (10:33 IST)
హైదరాబాద్‌లో ఇటీవల ఓ టెక్కీ అదృశ్యమై హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదే బాటలో మరో సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అదృశ్యమైంది. వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ అత్తాపూర్ హుడా కాలనీకి చెందిన మోహన్ రావు కుమార్తె భరణి (26) బెంగళూరులోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తోంది. 
 
అక్టోబర్ 26వ తేదీన రాత్రి 9 గంటలకు ఎంజీబీఎస్ నుంచి ఆమె బెంగళూరు బయలు దేరింది. ఆమెను బస్సు ఎక్కించి ఇంటికి చేరుకున్న మోహన్ రావు... కుమార్తెకు ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అని వచ్చింది. దీంతో, ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు అర్ధరాత్రి వరకు ఫోన్ చేస్తూనే ఉన్నారు. మరుసటి రోజు ఉదయం భరణి పని చేస్తున్న కంపెనీకి ఫోన్ చేయగా... ఆమె రాలేదని సమాధానం వచ్చింది. 
 
దీంతో, హైదరాబాదులో ఉన్న వారితో పాటు బయట ప్రాంతాల్లో ఉన్న బంధుమిత్రులను ఆరా తీశారు. అయినా భరణి ఆచూకీ తెలవలేదు. దీంతో, గురువారం రాత్రి తన కుమార్తె అచూకీ దొరకడం లేదంటూ అఫ్జల్ గంజ్ పీఎస్‌లో మోహన్ రావు ఫిర్యాదు చేశారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments