Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘ఛలో ఢిల్లీ’కి సిద్ధమవుతున్న తుళ్ళూరు రైతులు

Webdunia
గురువారం, 18 డిశెంబరు 2014 (13:10 IST)
తుళ్ళూరు రైతులు ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నాయకులను కలసి మద్దతు కోరాలని నిర్ణయించారు. రాజధాని నిర్మాణం కోసం పూలింగ్ విధానంలో తమ భూములను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్కునే ప్రయత్నం చేస్తోందనీ,దీని ద్వారా తమకు అన్యాయం జరుగుతుందని వారికి మొరపెట్టుకోనున్నారు. 
 
వీరంత కలసి డిసెంబర్ చివరి వారంలో ఛలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా దేశ రాజధానికి చేరనున్నారు. తాడేపల్లె, తూళ్ళూరు, మంగళగిరి మండలాలకు చెందిన 29 మంది రైతులు పంటలు పండే భూములను తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రాంతాలన్ని కృష్ణ నదీ పరీవాహక ప్రాంతంలో ఉన్నాయని అందువలన తమకు పాడిపంటలు పుష్కలంగా ఉన్నాయని వారు వాపోతున్నారు. ఇవిపోతే తమకు జీవనాధారం లేకుండా పోతుందని చెబుతున్నారు.
 
అయితే కేవలం వర్షాధారిత భూములను మాత్రం తీసుకుని మిగిలిన భూములను వదిలేయాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. క్రిష్ణా డెల్టా పరిరక్షణ సమితి వారికి సహకారం అందిస్తామని హామీ ఇచ్చింది. ఢిల్లీలో జాతీయ స్థాయిలో ఉన్న అన్నహజారే, మేథాపాట్కర్ వంటి సామాజిక కార్యకర్తలను కలిపేందుకు సహకరిస్తామని వారితో తూళ్ళూరు రైతులను సమావేశ పరుస్తామని చెప్పారు. అవకాశం ఉంటే ప్రధాన నరేంద్ర మోడీని కూడా కలసి వినతి పత్రం సమర్పించనున్నారు. 
 

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments