Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎట్టకేలకు డిప్యూటీ సీఎం పవన్‌కు కలిసిన యువ రైతు.. సమస్యలపై వినతిపత్రం (Video)

ఠాగూర్
మంగళవారం, 17 డిశెంబరు 2024 (17:33 IST)
రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు హిందూపురం నుంచి మంగళగిరి వరకు ఎడ్ల బండిపై వచ్చిన ఓ యువ రైతు ఎట్టకేలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను మంగళవారం కలిశారు. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు వీలుగా నవీన్ అనే యువ రైతు ఎడ్ల బండిపై హిందూపురం నుంచి మంగళగిరికి వరకు 27 రోజుల పాటు 760 కిలోమీటర్లు ప్రయాణించి సురక్షితంగా చేరుకున్నారు. 
 
మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఆయన గత రెండు రోజులుగా పడిగాపులు కాస్తున్న విషయాన్ని మీడియాలో కథనాలు వచ్చాయి. ఈ విషయం పవన్ దృష్టికి వెళ్లడంతో మంగళవారం ఉదయం రైతు నవీన్‌ను కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రైతుల సమస్యలను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రైతులు బాగు కోసం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. 
 
పవన్‌తో భేటీ అనంతరం రైతు నవీన్ మాట్లాడుతూ, రైతు సమస్య పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్‌ సానుకూలంగా స్పందించారన్నారు. ఖచ్చితంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారని, ముఖ్యంగా దళారీ వ్యవస్థ లేకుండా చేస్తామని మాట ఇచ్చారని నవీన్ హహర్షం వ్యక్తం చేశారు. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments