Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏనుగులు బాబోయ్.. ఏనుగులు..!! దాడిలో మరో రైతు మృతి

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (06:28 IST)
చిత్తూరు జిల్లాలో ఏనుగులు రెచ్చిపోతున్నాయి. పొలాలపై పడి పంటలను నాశనం చేస్తున్నాయి. గ్రామాల సమీపంలో సంచరిస్తూ హడలెత్తిస్తున్నాయి. గురువారం ఫారెస్టు వాచర్ ను చంపేసిన ఏనుగులు శుక్రవారం మరో రైతుపై దాడి చేసి తొక్కి చంపేశాయి. కుప్పం ప్రాంతంలో జరుగుతున్న ఈ ఏనుగుల దాడితో జనం బెంబేలెత్తిపోతున్నారు. వివరాలిలా ఉన్నాయి. 
 
ఏనుగుల దాడిలో అటవీశాఖ లైన్‌వాచర్ మృతి చెందిన ఘటన మరువకముందే మరో దారుణం చోటు చేసుకుంది. పలమనేరు నియోజకవర్గం వికోట మండలం కారగల్లు మరో రైతు శుక్రవారం మృత్యువాత పడ్డాడు. చంద్రానాయుడు అనే రైతు పొలంలో వద్దకు వెళ్ళాడు. కాపలా కాస్తు సంచరిస్తున్న ఏనుగులను తరిమేందుకు ప్రయత్నం చేశాడు. 
 
గ్రామస్తులతో కలసి వాటిని తరుముతుండగా మదమెక్కిన ఏనుగు ఒకటి తిరిగబడి చంద్రనాయుడుపై దాడి చేసింది. అదే ఏనుగు గురువారం అటవీ ఉద్యోగిని పొట్టన పెట్టుకుంది. అదే ఏనుగు చంద్రనాయుడును తొండంతో మోది చంపేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఇదే తరహా ఘటన వరుసగా రెండోది చోటు చేసుకోవడంతో జిల్లాలో ఆందోళన రేకెత్తుతోంది. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments