Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు బ్రెయిన్ చైల్డ్ కృష్ణలంక రిటైనింగ్ వాల్ (Video)

ఠాగూర్
శుక్రవారం, 6 సెప్టెంబరు 2024 (08:17 IST)
ప్రకాశం బ్యారేజి దగ్గర ఎప్పుడు గేట్లు వదిలినా, విజయవాడ కనకదుర్గ వారధి వద్ద నుంచి కృష్ణలంక, రామలింగేశ్వనగర్‌ తదితర ప్రాంతాలు, వరద ముంపుకి గురి అయ్యేవి. దీంతో రీటైనింగ్ వాల్ నిర్మిస్తేనే ఈ సమస్యకు పరిష్కారం అని తెలుగుదేశం పార్టీ గుర్తించింది. 2014 ముందు నుంచి దాదాపుగా దశాబ్ద కాలం పాటు, ఈ రిటైనింగ్ వాల్ కోసం పోరాటాలు చేసింది. ఆ పార్టీ సీనియర్ నేత దివంగత ఎర్రంనాయుడు జీవించివున్న సమయంలో ఆయనతో పాటు పలువురు సీనియర్ నేతలతో కలిసి, టిడిపి పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. 
 
విజయవాడ నగరంలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో దాదాపుగా 20 వేల కుటుంబాలు ఉన్నాయి. 70 నుంచి 80 వేల మంది ప్రజల చిరకాల స్వప్నం ఈ రిటైనింగ్ వాల్.. 2014 ఎన్నికల్లో, మేము రిటైనింగ్ వాల్ నిర్మిస్తాం అనే హామీతో, టిడిపి ఎన్నికలకు వెళ్ళింది. ప్రజలు గెలిపించారు. హామీ ఇచ్చినట్టే కృష్ణలంక రిటైనింగ్ వాల్ పనులు మొదలు పెట్టింది నాటి టిడిపి ప్రభుత్వం 90 శాతం మేరకు పూర్తి చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైకాపా మిగిలిన 10 శాతం పూర్తి చేసింది. కానీ, ఇపుడు వైకాపా పాలకులు ఈ రిటైనింగ్ వాల్‌ను తామే పూర్తి చేశామంటూ ఊదరగొట్టుడు ప్రచారం చేసుకుంటున్నారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments