Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలు డబ్బులు అడుగుతోందనీ... దట్టమైన చెట్ల మధ్యకు తీసుకెళ్లి...

Webdunia
బుధవారం, 24 అక్టోబరు 2018 (10:02 IST)
వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ తనను పదేపదే డబ్బులు అడుగుతూ బెదిరిస్తుండటంతో ఆమెను ప్రియుడు హత్య చేశాడు. ఆ మహిళను నమ్మించి ఊరుబయట వున్న దట్టమైన చెట్ల పొద్దల్లోకి తీసుకెళ్లి తలపై పెద్ద బండరాయితో కొట్టి ఆపై మెడకు ఉరిబిగించి చంపేశాడు. 
 
హైదరాబాద్ నగరంలోని శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్, ఉప్పుగూడ భయ్యాలాల్‌ నగర్‌కు చెందిన నేనావత్‌ ఈశ్వర్‌ అనే వ్యక్తికి వి.రంగి (40) అనే మహిళ పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. పైగా, ఈశ్వర్‌కు పెళ్లి అయినప్పటికీ ఆ మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో ఈశ్వర్‌ను రంగి పదేపదే డబ్బులు అడుగుతూ వచ్చింది. పైగా, డబ్బులివ్వకుంటే పోలీసులకు అప్పగిస్తానని బెదిరిస్తూ వచ్చింది. 
 
ఆమె బెదిరింపులను తట్టుకోలేని ఈశ్వర్... ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈనెల 15న లాల్‌దర్వాజ లేబర్‌ అడ్డాలో ఉన్న ఆమెను ఇంట్లో పని ఉందని చెప్పి ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని రావిరాల ప్రాంతంలో దట్టమైన చెట్లు ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లాడు. తలపై బలంగా మోది తను తీసుకెళ్లిన తాడుతో ఉరివేశాడు. విచారణలో ఆమెను తానే హత్య చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడించాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments