శేషాచలం అడవుల్లో అలజడి .. పేలుడు పదార్థాలు స్వాధీనం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నెలవై ఉన్న శేషాచలం అడవుల్లో అర్థరాత్రి అలజడి రేగింది. కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్‌కు పేలుడు పదార్థాలు కనిపించాయి. దీంతో టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగి పేలుడు పదార్థ

Webdunia
మంగళవారం, 30 జనవరి 2018 (14:22 IST)
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి నెలవై ఉన్న శేషాచలం అడవుల్లో అర్థరాత్రి అలజడి రేగింది. కూంబింగ్ నిర్వహిస్తున్న టాస్క్ ఫోర్స్‌కు పేలుడు పదార్థాలు కనిపించాయి. దీంతో టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగి పేలుడు పదార్థాలు తీసుకొచ్చిన వ్యక్తుల కోసం అర్థరాత్రి అడవుల్లో జల్లెడ పట్టారు. అయితే ఎవరూ కనిపించకపోవడంతో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. 
 
టాస్క్ ఫోర్స్ స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల్లో కెసాసిటర్లు, కండెన్సర్లు, సర్య్కూట్‌లు ఉన్నాయి. వీటితో క్లైమోర్‌మెన్‌ను తయారుచేయవచ్చు అంటున్నారు టాస్క్ ఫోర్స్. 2003 అక్టోబర్ 1వ తేదీన అలిపిరి వద్ద చంద్రబాబునాయుడుపై జరిగిన బాంబు దాడిలో కూడా ఇలాంటి పరికరాలనే వాడి క్లైమోర్‌మెన్ పేలుడు పదార్థాలను తయారుచేశారు. 
 
శ్రీవారి మెట్టుసమీపంలో అందులోనూ భక్తులు తిరిగే ప్రాంతంలో ఈ పేలుడు పదార్థాలు లభించడం తీవ్ర కలకలం రేపుతున్నాయి. వీఐపీలను టార్గెట్ చేశారా.. లేకుంటే భక్తులను టార్గెట్ చేసి ఎలక్ట్రానిక్ పరికరాలను ఇక్కడ అగంతకులు తీసుకువచ్చారా? అన్న కోణంలో టాస్క్‌ఫోర్స్ దర్యాప్తు కొనసాగిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

Naveen Polishetty: అనగనగా ఒక రాజు తో సంక్రాంతి పోటీలో నవీన్ పోలిశెట్టి

రాజ్‌తో కలిసి సమంత దీపావళి వేడుకలు.. ఇక పెళ్లే మిగిలివుందా?

బాలీవుడ్‌లో చిరునవ్వుల నటుడు అస్రానీ ఇకలేరు

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments