Webdunia - Bharat's app for daily news and videos

Install App

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

ఠాగూర్
శనివారం, 12 ఏప్రియల్ 2025 (15:16 IST)
"ఒకే దేశం - ఒకే ఎన్నిక" పేరుతో నిర్వహించాలని భావించే జమిలి ఎన్నికలపై కొన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించడంలో రాజకీయ కోణం ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఒకే దేశం - ఒకే ఎన్నికపై తిరుపతిలో జరిగిన మేధావుల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జమిలి ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఇబ్బంది అనేది కేవలం అపోహ మాత్రమేనని చెప్పారు.
 
జమిలి ఎన్నికల ద్వారా ఎన్నికల ఖర్చు ఆదా అవుతుందని వెంకయ్య నాయుడు అన్నారు. ఈ ఎన్నికలను కొన్ని పార్టీలు వ్యతిరేకించడంలో రాజకీయ కోణం మినహా మరేమీ లేదన్నారు. అధికారం పోతే కొన్ని పార్టీలు తట్టుకోలేకపోతున్నాయని చెప్పారు. పార్టీ ఫిరాయించడంపై ప్రజాస్వామ్యానికి చేటు అని అన్నారు. ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలోకి జంప్ కావడం ఏమాత్రం సబబు కాదన్నారు. 
 
కాగా, కేంద్రం జమిలి ఎన్నికల వైపు మొగ్గు చూపుతోందన్న విషయం తెల్సిందే. ఈ క్రమంలో జమిలి ఎన్నికలపై దేశ వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలో ఒకే దేశం - ఒకే ఎన్నికపై మేధావుల సదస్సును నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దంగల్ హీరోయిన్ ఫాతిమా సనా షేక్ స్టేజిపైన ఏం చేసిందో తెలుసా? (video)

Prabhas: నిర్మాత వదిలేసినా, ఇండస్ట్రీ వద్దన్నా మారుతీ తో ప్రభాస్ రాజాసాబ్ ఎందుకు చేశాడు

Rashmika: మా కెమిస్ట్రీ చూశాక మరిన్ని అవకాశాలు వస్తాయి : రష్మిక మందన్నా

Ye Maaya Chesave: ఏ మాయ చేసావే రీ-రిలీజ్: ప్రమోషన్ కోసం చైతూ- సమంత కలిసి కనిపిస్తారా?

'కన్నప్ప'కు షాకిచ్చిన రివిజన్ కమిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments