Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమరావతి రైతుల కోరిక నెరవేరింది.. చాలా సంతోషంగా ఉంది : వెంకయ్య నాయుడు

వరుణ్
శుక్రవారం, 14 జూన్ 2024 (08:21 IST)
అమరావతి రైతుల కోరిక మేరకు అమరావతిని నవ్యాంధ్ర రాజధానిగా ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, అనేక అడ్డంకులు, ఇబ్బందులు, కష్టనష్టాలు ఎదుర్కొని వేలాది మంది రోజుల పాటు ఉద్యమం కొనసాగించిన అమరావతి రైతుల అభీష్టం నెరవేరిందన్నారు. 
 
ఏపీ సీఎంగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు. మొదటి నుంచి కూడా తాను  రాష్ట్రానికే ఒకే రాజధాని ఉండాలని ఆకాంక్షించానని తెలిపారు. రాజధాని లేని రాష్ట్రం తల లేని మొండెం వంటిదన్నారు. రాజధాని ఒక్కటే ఉండాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలన్నదే ప్రతి ఒక్కరి కోరిక అని చెప్పారు. 
 
ఏపీ కానివ్వండి, మరే రాష్ట్రమైనా కానివ్వండి. సమగ్రాభివృద్ధి ఎంతో అవసరం అని వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు. ప్రాంతీయ ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవడం తప్పు కాదని తెలిపారు. కాగా, గత వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో ఏపీకి రాజధానికి లేకుండా చేయడమే కాకుండా అమరావతిని పూర్తిగా విధ్వంసం చేయాలన్న సంకల్పంతో శ్మశానంగా మార్చివేసిన విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments