Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప జిల్లాలో టీడీపీకి షాక్.. రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (13:04 IST)
ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. అయినప్పటికీ అధికార విపక్ష పార్టీల్లో జంపింగ్‌లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అధికార తెలుగుదేశం పార్టీకి కడప జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కేంద్ర మాజీమంత్రి సాయిప్రతాప్ టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 
 
ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించి, గత యూపీఏ 2 ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌ రెడ్డికి బాగా సన్నిహితుడు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కనుమరుగై పోవడంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. 
 
అయితే, ఆయన అక్కడ కూడా ఇమడలేక పోయారు. ఓ సమయంలో ఆయన వైఎస్ జగన్‌ను డైనమిక్ లీడరంటూ ప్రశంసించారు. నిత్యం జనాల్లో ఉండేందుకే జగన్ భారీ ప్రణాళికలు రూంపొందించుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. అయితే, శుక్రవారం టీడీపీకి రాజీనామా చేసిన సాయిప్రతాప్.. ఇక త్వరలోనే వైసీపీలో చేరడం ఖాయమంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దక్షిణాదిలో గుడికట్టాలంటూ డిమాండ్ చేస్తున్న బాలీవుడ్ హీరోయిన్! (Video)

బాహుబలి 1 రికార్డ్.. స్పానిష్ భాషలో నెట్‌ఫ్లిక్స్ రిలీజ్

దీక్షిత్ శెట్టి బైలింగ్వల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి ఫస్ట్ సింగిల్

A.R. Murugadoss: శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ చిత్రం మదరాసి

Sharwanand: 1960లో జరిగిన కథతో శర్వానంద్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

రూ.49000 చెల్లిస్తే చాలు.. మహిళలు ఈజీగా నడిపే ఈవీ స్కూటర్ల వివరాలివే

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments