Webdunia - Bharat's app for daily news and videos

Install App

కడప జిల్లాలో టీడీపీకి షాక్.. రాజీనామా చేసిన కేంద్ర మాజీ మంత్రి

Webdunia
శనివారం, 30 మార్చి 2019 (13:04 IST)
ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. అయినప్పటికీ అధికార విపక్ష పార్టీల్లో జంపింగ్‌లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా అధికార తెలుగుదేశం పార్టీకి కడప జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కేంద్ర మాజీమంత్రి సాయిప్రతాప్ టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 
 
ఈయన గతంలో కాంగ్రెస్ పార్టీ తరపున రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహించి, గత యూపీఏ 2 ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్‌ రెడ్డికి బాగా సన్నిహితుడు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కనుమరుగై పోవడంతో ఆయన తెలుగుదేశం పార్టీలో చేరారు. 
 
అయితే, ఆయన అక్కడ కూడా ఇమడలేక పోయారు. ఓ సమయంలో ఆయన వైఎస్ జగన్‌ను డైనమిక్ లీడరంటూ ప్రశంసించారు. నిత్యం జనాల్లో ఉండేందుకే జగన్ భారీ ప్రణాళికలు రూంపొందించుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. అయితే, శుక్రవారం టీడీపీకి రాజీనామా చేసిన సాయిప్రతాప్.. ఇక త్వరలోనే వైసీపీలో చేరడం ఖాయమంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎన్టీఆర్, హృతిక్ ల వార్ 2 నుంచి సలామే అనాలి గ్లింప్స్ విడుదల

కిష్కిందపురి మంచి హారర్ మిస్టరీ : బెల్లంకొండ సాయి శ్రీనివాస్

లిటిల్ హార్ట్స్ చూస్తే కాలేజ్ డేస్ ఫ్రెండ్స్, సంఘటనలు గుర్తొస్తాయి : బన్నీ వాస్

చెన్నై నగరం బ్యాక్ డ్రాప్ లో సంతోష్ శోభన్ తో కపుల్ ఫ్రెండ్లీ మూవీ

తెలంగాణ గ్రామీణ నేపథ్యంతో మధుర శ్రీధర్ నిర్మాణంలో మోతెవరి లవ్ స్టోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

కౌగిలింత, ఆలింగనంతో అంత మంచిదా.. ప్రేమ, ఓదార్పు కోసం హగ్ చేసుకుంటే?

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

తర్వాతి కథనం
Show comments