Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ సేవలు వినియోగించుకునే ఛాన్స్ : ఉండవల్లి

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (21:11 IST)
కేంద్ర హోం మంత్రి అమిత్ షా‌తో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆదివారం రాత్రి హైదరాబాద్ నగరం శంషాబాద్‌లో ఉన్న నోవాటెల్ హోటల్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ భేటీ ఇపుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 
 
ఈ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ ఇతర పార్టీలు మాత్రం రాజకీయ ప్రాధాన్యం లేనిదే ఎన్టీఆర్‌తో అమిత్ షా అంత తీరికగా సమావేశమవుతారా? అంటూ ప్రశ్నిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందించారు. 
 
జూనియర్ ఎన్టీఆర్‌తో అమిత్ షా సమావేశం వెనుక ఖచ్చితంగా రాజకీయం అంశం ఉండి వుంటుందన్నారు. ఒక్క తెలంగాణాలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్టీఆర్ సేవలను వినియోగించుకునే దిశగా ఈ సమావేశంలో చర్చలు జరిగివుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 
 
అన్ని అంశాలపై జూనియర్ ఎన్టీఆర్‌కు సంపూర్ణ అవగాహన ఉందని ఈ సందర్భంగా ఉండవల్లి గుర్తుచేశారు. అందువల్ల జూనియర్ ఎన్టీఆర్ వంటి మరికొందరిని బీజేపీ తనవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాల్లో భాగంగానే ఈ తరహా సమావేశాలకు శ్రీకారం చుట్టివుండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments