Webdunia - Bharat's app for daily news and videos

Install App

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఠాగూర్
శుక్రవారం, 28 మార్చి 2025 (15:15 IST)
విజయవాడ గన్నవరంలోని టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో మరోమారు చుక్కెదురైంది. వంశీకి వచ్చే నెల 9వ తేదీ వరకు రిమాండ్ పొడగించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నేటితో రిమాండ్ ముగియడంతో వంశీని శుక్రవారం ఉదయం జిల్లా జైలు నుంచి గన్నవరం పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. వంశీతో పాటు మరో నిందితుడు నిమ్మ లక్ష్మీపతిని కూడా పోలీసులు ప్రత్యక్షంగా కోర్టులో హాజరుపరిచారు.
 
ఇరు వర్గాల వాదనలు ఆలకించిన తర్వాత ఈ కేసులో వంశీకి ఏప్రిల్ 9వ తేదీ వరకు సీఐడీ కోర్టు రిమాండ్ పొడగిస్తూ ఆదేశాలు జారీచేసింది. సీఐడీ కోర్టు రిమాండ్‌ను పొడగించడంతో ఆయనను విజయవాడ జైలుకు తరలించారు. మరోవైపు, సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా విజయవాడ జైలులో ఉన్న విషయం తెల్సిందే. 
 
ఇక సత్యవర్థన్ కిడ్నాప్ కేసుకు సంబంధించి విజయవాడ ఎస్పీ, ఎస్టీ కోర్టులో ఇప్పటికే వాదనలు ముగిశాయి. వంశీకి బెయిల్ పిటిషన్‌‍పై శుక్రవారం సాయంత్రానికి తీర్పు వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ కోర్టులో కూడా వంశీకి బెయిల్ లభిస్తుందా లేదా అన్నది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కాగా, ఈ బెయిల్ పిటిషన్‌పై తీర్పు శుక్రవారం సాయంత్రం 4 గంటల తర్వాత వెలువడనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Chay and Samantha Divorce: సమంత- చైతూల విడాకులకు కారణం ఏంటంటే?

వ్యాపారవేత్తను పెళ్లాడనున్న అల్లు అర్జున్ హీరోయిన్

ఐటీ ఉద్యోగిని కిడ్నాప్ కేసు - పరారీలో మలయాళ సినీ నటి

Allu Arjun: ప్రభాస్ తోపాటు అగ్ర హీరోలతో దర్శకులు క్రేజీ ట్విస్ట్ లు

Kamal Haasan: హే రామ్ సినిమా.. కమల్ హాసన్ లవ్ స్టోరీ గురించి చెప్పేసిన శ్రుతి హాసన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం
Show comments