Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాకు మరో షాక్ : మాజీ ఎమ్మెల్యే రెహ్మాన్ గుడ్‌‍బై.. జగన్‌కు లేఖ

ఠాగూర్
బుధవారం, 25 సెప్టెంబరు 2024 (13:36 IST)
గత సార్వత్రిక ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన వైకాపాకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన చోటామోటా నేతలంతా వరుసగా తప్పుకుంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు పార్టీకి రాజీనామాలు చేశారు. అలాగే, పార్టీ ప్రాథమిక సభ్వత్వానికి కూడా టాటా చెప్పేశారు. వీరిలో సీనియర్ నేతలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్యలు ఉన్నారు. వీరితో పాటు పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మాజీ ఎమ్మెల్యే, ఉడా మాజీ చైర్మన్ ఎస్ఏ రెహ్మాన్ వైకాపాకు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పంపించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముస్లింల ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం ఎంతో చేస్తోందని అన్నారు. పాలనలో వైకాపా అన్ని విధాలుగా విఫలమైందన్నారు. ఎంసెట్ పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించలేకపోయిందన్నారు. అందుకే ఎన్నికల్లో వైకాపాను ప్రజలు చిత్తుగా ఓడించారని, ఇలాంటి ప్రరిస్థితుల్లో తాము వైకాపాలో కొనసాగలేమన్నారు. 
 
కాగా, వైకాపా ప్రారంభం నుంచి పార్టీలో రెహ్మాన్ ఎంతో కీలకంగా వ్యవహరించారు. అలాంటి రెహ్మాన్ ఇపుడు పార్టీని వీడటం ఉత్తరాంధ్రలో వైకాపా గట్టి ఎదురుదెబ్బగానే చెప్పుకోవచ్చు. మరోవైపు, రెహ్మాన్ టీడీపీలో చేరబోతున్నట్టు ప్రచారం సాగుతుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments