Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వ కొలువుకు జేడీ రాజీనామా.. జనసేన పార్టీలో...

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తన ప్రభుత్వ కొలువుకు రాజీనామా చేశారు. దీంతో ఆయన జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో అడిషనల్‌ డీజీగా ఉన్న ఆయన స్వచ్ఛంద పదవ

Webdunia
శుక్రవారం, 23 మార్చి 2018 (09:06 IST)
సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ తన ప్రభుత్వ కొలువుకు రాజీనామా చేశారు. దీంతో ఆయన జనసేనలో చేరబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో అడిషనల్‌ డీజీగా ఉన్న ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. దాంతో ఈ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రాజకీయాల్లోకి వస్తున్నారని, జనసేనలో చేరతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. 
 
బీజేపీ నేతలు కూడా ఆయనతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. కర్నూలు జిల్లా శ్రీశైలానికి చెందిన లక్ష్మీనారాయణ 1990 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. హైదరాబాద్‌లో సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌(జేడీ)గా ఉన్న సమయంలో తెలుగు ప్రజలకు ఆయన సుపరిచయం. ముఖ్యంగా, వైకాపా అధినేత జగన్‌ మోహన్ రెడ్డితో పాటు కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి అక్రమాస్తుల కేసు, ఓబుళాపురం గనులు వంటి కేసుల దర్యాప్తునకు నేతృత్వం వహించడంతో బాగా పాపులర్‌ అయ్యారు. 
 
సీబీఐలో డిప్యూటేషన్‌ పూర్తయిన తర్వాత మహారష్ట్రకు తిరిగి వెళ్లిపోయారు. అక్కడ విధులు నిర్వహిస్తున్నా.. ఏపీ, తెలంగాణలో పాఠశాలల మరమ్మతు పనులు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ఆ సమయంలోనే ఆయన రాజకీయాల్లోకి వస్తారని ప్రచారం జరిగింది. కానీ ఎక్కడా ఈ అంశంపై మాట్లాడింది లేదు. ఇప్పుడు స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేయడంతో ఆ ప్రచారం మళ్లీ జోరందుకుంది. పవన్‌ కల్యాణ్‌తో కలిసి రాజకీయ రంగంలో అడుగులు వేస్తారని ప్రచారం జరుగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments