Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్‌ చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే: అమర్‌నాథ్‌రెడ్డి

Webdunia
మంగళవారం, 8 జూన్ 2021 (13:36 IST)
రాష్ట్రాభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నవన్నీ తప్పుడు లెక్కలే అని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి విమర్శించారు. జగన్ రెండేళ్ల పాలనలో రూ.17లక్షల కోట్ల పరిశ్రమలు తరలిపోయాయన్నారు. రాష్ట్రాభివృద్ధి రేటు - 2.58కి, పారిశ్రామికాభివృద్ధి రేటు - 3.26కి దిగజారిందని తెలిపారు.

జగన్ ప్రభుత్వ విధ్వంసకర విధానాలతోనే పారిశ్రామికాభివృద్ది రేటు మైనస్‌కు చేరిందని వ్యాఖ్యానించారు. పారిశ్రామికాభివృద్ధిలో కీలకపాత్ర వహించే కారిడార్లలో భూసేకరణ 20 శాతం కూడా పూర్తికాలేదని అన్నారు. భూసేకరణకు రూ.50వేల కోట్లు అవసరమైతే బడ్జెట్‌లో రూ.1000 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు.

జగన్ ప్రభుత్వ అసమర్థ విధానాలతో కోటిమంది అసంఘటితరంగ కార్మికులు రోడ్డున పడ్డారని మండిపడ్డారు. రెండేళ్లలో 4.78 లక్షల ప్రభుత్వోద్యోగాలు ఇచ్చినట్లు తప్పుడు లెక్కలు చూపుతున్నారన్నారు. వైసీపీ కార్యకర్తలకు ఇచ్చిన 3.81లక్షల వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలేనా? అని ప్రశ్నించారు.

నిరుద్యోగులను మూటలుమోసే కూలీలుగా మార్చిన రేషన్ బండ్ల డ్రైవర్లు, హెల్పర్లను కూడా ప్రభుత్వోద్యోగులుగా చూపడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా లక్షలాది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న జాబ్ కాలండర్ డీఎస్సీ ఎక్కడ అని అమర్‌నాథ్‌రెడ్డి ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

Ali: అలీ క్లాప్ తో ప్రారంభమైన చండీ దుర్గమా సినిమా

Samantha: దుబాయ్‌లో రాజ్ నిడిమోరుతో హాలీడేస్ ఎంజాయ్ చేసిన సమంత?

OG: ఓజీ షూటింగ్ లో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్- తదుపరి హరీష్ శంకర్ చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments