Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్ వంటి ముఖ్యమంత్రిని నేనెప్పుడూ చూడలేదు : గవర్నర్ నరసింహన్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి నేతను, సీఎంను తానెప్పుడూ చూడలేదని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. అంధకారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ వెలుగులోకి తెచ్చారని కి

Webdunia
సోమవారం, 2 జనవరి 2017 (08:25 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వంటి నేతను, సీఎంను తానెప్పుడూ చూడలేదని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. అంధకారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ వెలుగులోకి తెచ్చారని కితాబిచ్చారు.  అధికారులు, మంత్రుల్లో టీమ్‌ స్పిరిట్‌ నింపారని, 2017లో తెలంగాణకు మరిన్ని విజయాలు అందించాలంటూ సీఎం కేసీఆర్‌పై గవర్నర్ ప్రశంసల వర్షం కురిపించారు. 
 
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, సీనియర్‌ అధికారులు గవర్నర్‌ నరసింహన్‌ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ... కేసీఆర్‌ ప్రభుత్వం సాధించిన విజయాలు, ఆవిష్కరణలపై పొగడ్తల జల్లు కురిపించారు. 'రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందనుకుంటే ఎవరి సలహాలనైనా కేసీఆర్‌ తీసుకుంటారు. ఇలాంటి సీఎంను నిజంగా నేనెప్పుడూ చూడలేదు. ఆయనకు ఓ ఆలోచన వచ్చిందంటే చాలు... ఎంతటి అవాంతరాలు ఎదురైనా అమలు చేసేంత వరకు వెనక్కి తగ్గరు' అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దేశంలోనే నంబర్‌వనగా నిలుస్తుందన్నారు. 
 
రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచినీరు అందించాలన్న లక్ష్యంతో సర్కారు చేపట్టిన మిషన్ భగీరథ పథకం ఒక నీటి తొట్టిలాంటిందని గవర్నర్‌ అన్నారు. ఇప్పటికే ఈ పథకానికి చాలా అభినందనలు, ప్రశంసలు వచ్చాయన్నారు. భగీరథ పథకం ఈ ఏడాది ఆఖరుకు పూర్తవుతుందని.. మిషన్ కాకతీయ పథకంలో రెండు దశలు పూర్తయ్యాయన్నారు. వీటితో పాటు ఇతర నీటి పారుదల పథకాలు, కార్యక్రమాలు త్వరలోనే ఫలాలు అందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 
 
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అంధకారం నెలకొంటుందని, రాష్ట్రంలో విద్యుత సంక్షోభం ఏర్పడుతుందని, ఉత్పత్తి, సరఫరా తగ్గుతాయన్న భయాందోళనలు ఉండేవన్నారు. కానీ, ఈ అపనమ్మకాలను కేసీఆర్‌ తిప్పికొట్టారని కొనియాడారు. విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్ది, తమసోమా జ్యోతిర్గమయ (చీకటి నుంచి వెలుగులోకి ప్రస్థానం) అన్నట్లుగా కొత్త నిర్వచనం ఇచ్చారన్నారు. 
 
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌పైనా గవర్నర్‌ అభినందనల జల్లు కురిపించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో రాష్ట్రాన్ని ఆయన నంబర్‌వన్‌గా నిలిపారని కితాబిచ్చారు. ‘ధనిక, మేధావి వర్గాలకే ఐటీ పరిమితమైందన్న అభిప్రాయాలుండేవి. ప్రభుత్వ విధానాలతో ఐటీ సామాన్యుల దరికి చేరింది’ అని చెప్పారు. టీ-హబ్‌ అనేది ప్రపంచంలోనే ఒక గొప్ప అన్వేషణ అని కొనియాడారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments