Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వసూలు చేసే ఇంజనీరింగ్ ఫీజులు ఇవే...

వరుణ్
సోమవారం, 8 జులై 2024 (09:40 IST)
2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంజనీరింగ్ కాలేజీల్లో వసూలు చేసే మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో మొత్తం 210 బీటెక్, రెండు ఆర్కికెట్చర్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా, ఈ కాలేజీలో కొత్త విద్యా సంవత్సరానికి వసూలు చేసే ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఇంజనీరింగ్ బీటెక్ కోర్సులో అత్యధికంగా రూ.1.03 లక్షల నుంచి రూ.1.05 లక్షల వరకు, అత్యల్పంగా రూ.40 వేల వరకు నిర్ణయించారు. ఇందులో రూ.40 వేల రుసుం ఉన్న కాలేజీలు 114 ఉండగా, రూ.లక్ష కంటే ఎక్కువ ఫీజును వసూలు చేసే కాలేజీలు ఎనిమిది ఉన్నాయి. రెండు ఆర్కిటెక్చర్ కళాశాలలకు రూ.35 వేల చొప్పున రుసుము ఖరారు చేశారు. 
 
ఈ ఫీజు పరిధిలోనే ట్యూషన్, అఫిలియేషన్, గుర్తింపుకార్డు, మెడికల్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర విద్యార్థి కార్యకలాపాలు తదితర ఖర్చులన్నీ వస్తాయని పేర్కొంది. అదనంగా కళాశాలలు వసూలు చేయకూడదు. వసతి, రవాణా, మెస్, రిజిస్ట్రేషన్, ప్రవేశ, రిఫండబుల్ ఫీజులు ఇందులో చేర్చలేదు. నిర్ణయించిన రుసుములకు మించి అదనంగా క్యాపిటేషన్, డొనేషన్లు తదితరాల పేరుతో ఎలాంటి మొత్తమూ వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా చేసేవారిపై చట్టప్రకారం జరిమానా విధించడంతోపాటు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేను : జూనియర్ ఎన్టీఆర్

మహేష్ బాబు ఆవిష్కరించిన మా నాన్న సూపర్ హీరో ట్రైలర్‌

యూట్యూబర్ హర్ష సాయిపై లుకౌట్ నోటీసులు జారీ.. ఎందుకంటే?

విజువ‌ల్ గ్రాఫిక్స్‌ హైలైట్ గా శ్ర‌ద్ధాదాస్ త్రికాల చిత్రం

అమ్మ‌లాంటి వైద్యం హోమియోపతి అందుకే కాదంబ‌రి హోమియోపతి క్లినిక్ ప్రారంభించాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తేనె మోతాదుకి మించి సేవిస్తే జరిగే నష్టాలు ఏమిటి?

గుండె జబ్బులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ తగ్గించుకునేదెలా?

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

తర్వాతి కథనం
Show comments