Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వసూలు చేసే ఇంజనీరింగ్ ఫీజులు ఇవే...

వరుణ్
సోమవారం, 8 జులై 2024 (09:40 IST)
2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంజనీరింగ్ కాలేజీల్లో వసూలు చేసే మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో మొత్తం 210 బీటెక్, రెండు ఆర్కికెట్చర్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా, ఈ కాలేజీలో కొత్త విద్యా సంవత్సరానికి వసూలు చేసే ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఇంజనీరింగ్ బీటెక్ కోర్సులో అత్యధికంగా రూ.1.03 లక్షల నుంచి రూ.1.05 లక్షల వరకు, అత్యల్పంగా రూ.40 వేల వరకు నిర్ణయించారు. ఇందులో రూ.40 వేల రుసుం ఉన్న కాలేజీలు 114 ఉండగా, రూ.లక్ష కంటే ఎక్కువ ఫీజును వసూలు చేసే కాలేజీలు ఎనిమిది ఉన్నాయి. రెండు ఆర్కిటెక్చర్ కళాశాలలకు రూ.35 వేల చొప్పున రుసుము ఖరారు చేశారు. 
 
ఈ ఫీజు పరిధిలోనే ట్యూషన్, అఫిలియేషన్, గుర్తింపుకార్డు, మెడికల్, ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర విద్యార్థి కార్యకలాపాలు తదితర ఖర్చులన్నీ వస్తాయని పేర్కొంది. అదనంగా కళాశాలలు వసూలు చేయకూడదు. వసతి, రవాణా, మెస్, రిజిస్ట్రేషన్, ప్రవేశ, రిఫండబుల్ ఫీజులు ఇందులో చేర్చలేదు. నిర్ణయించిన రుసుములకు మించి అదనంగా క్యాపిటేషన్, డొనేషన్లు తదితరాల పేరుతో ఎలాంటి మొత్తమూ వసూలు చేయకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలా చేసేవారిపై చట్టప్రకారం జరిమానా విధించడంతోపాటు న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments