Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజధాని తరలింపుపై ఉద్యోగుల మండిపాటు

Webdunia
బుధవారం, 8 జనవరి 2020 (07:09 IST)
ఆంధ్రప్రదేశ్ రాజధాని తరలింపుపై సచివాలయం ముందు పబ్లిక్ పార్క్‌లో ఉద్యోగుల సమావేశమయ్యారు. విశాఖకు సచివాలయం తరలింపు నిర్ణయంపై మండిపడ్డారు.

ఈ నేపథ్యంలో తమ సంఘాల నేతలతో ఉద్యోగులు వాగ్వాదానికి దిగారు. రాజధాని తరలింపుపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదంటూ..అప్స అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి ఉద్యోగులకు సర్దిచెప్పబోయారు. నేతల వ్యాఖ్యలతో ఉద్యోగులు అర్ధాంతంరంగా బయటకు వచ్చేశారు.

మీడియాతో తమగోడును వెళ్లబోసుకున్నారు. రాజధాని మార్పుపై కన్నీటి పర్యంతమయ్యారు. అమరావతిలో రుణాలు తీసుకుని ఇళ్లు కొనుక్కున్నామని, మరో ప్రభుత్వం వస్తే విశాఖ నుంచి రాజధానిని మారుస్తారా? అని ప్రశ్నించారు.

తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నామని, రాజకీయపార్టీల మధ్య గొడవలకు మమ్మల్ని బలిచేయొద్దని ఉద్యోగులు వేడుకుంటున్నారు.
 
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
జీఎన్‌రావు, బీసీజీ రిపోర్ట్‌లను స్వాగతిస్తున్నామని ఏపీ ఎన్‌జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. విశాఖపట్టణం వెళ్లడానికి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలన్నారు.

గతంలో ఇచ్చిన సౌకర్యాలకు అదనంగా సౌకర్యాలు కల్పించాలన్నారు. రైతులు చేస్తున్న ఉద్యమం పొలిటికల్ పార్టీల ఉద్యమమేనని చంద్రశేఖర్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ ఐడియాలను ఫిలింఛాంబర్ గాలికొదిలేసిందా?

ఫుట్ బాల్ నేపథ్యంలో డ్యూడ్ చిత్రం టీజర్ వచ్చేస్తోంది

విజయ్ ఆంటోనీ మార్గన్ హక్కుల్ని దక్కించుకున్న ఏసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్

గద్దర్ అవార్డ్ లలో తెలంగాణా సినిమాకు న్యాయం జరగలేదా?

Shiva: అక్కినేని నాగార్జున ను నిలబెట్టిన శివ సరికొత్తగా రీరిలీజ్ కాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

ఓరి వీడి లవ్ ప్రపొజల్ ఐడియా తగలెయ్య (video)

తర్వాతి కథనం
Show comments