Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభుత్వానికి, ప్రజలకు న‌డుమ వారధిలా ఉద్యోగులు: మంత్రి వెలంపల్లి

Webdunia
శనివారం, 25 జనవరి 2020 (22:01 IST)
ప్రజల వద్దకే సంక్షేమ ఫలాలు అందించాలని సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యంలో భాగంగా వార్డు సచివాలయాల‌ను ప్రారంభించిన‌ట్లు మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు తెలిపారు.

ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలోని 27వ డివిజన్ హరిజనవాడలో, 28వ డివిజన్ ఆర్టీసీ వర్క్‌షాప్ రోడ్డులో, 30వ‌ డివిజన్ మిల్క్ ప్రాజెక్టు వద్ద, 50వ‌ డివిజన్ మాంగో మార్కెట్, 39వ‌ డివిజన్‌లోని ద‌ళ‌వాయి సుబ్బరామయ్య మున్సిప‌ల్ హైస్కూల్ వద్ద ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాల‌ను శ‌నివారం ఉద‌యం మంత్రి  వెలంప‌ల్లి లాంఛ‌నంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గాంధీజీ  కలలు కన్న గ్రామస్వరాజ్యం స్థాపన లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాల‌ను ప్రారంభించుకోవ‌డం జరిగిందన్నారు. అవినీతికి చోటు లేకుండా ప్రభుత్వ నిర్ణయాలను, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని ఈ సంద‌ర్భంగా ఉద్యోగులకు సూచించారు.

ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలా సచివాలయ వార్డు ఉద్యోగులు ఉండాలని, 72 గంటల్లో సత్వర సేవలు పూర్తి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నేత‌లు, ప‌లువురు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆరోగ్యంగా కులసాగానే ఉన్నాను .. రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లా : ఉపేంద్ర క్లారిటీ

తెరచాప సినిమా కోసం ఆసుపత్రిపాలయ్యేవిధంగా కష్టపడ్డారు : 30 ఇయర్స్ పృద్వి

ఎఫ్1 వీకెండ్‌ మియామిలో రానా దగ్గుబాటి, లోకా లోకా క్రూ సందడి

తమిళ దర్శకుడిగా తెలుగు సినిమా చేయడం చాలా ఈజీ : డైరెక్టర్ కార్తీక్ రాజు

త్రిషకు పెళ్ళయిపోయిందా... భర్త ఆ యువ హీరోనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments