Webdunia - Bharat's app for daily news and videos

Install App

భావోద్వేగానికి గురైన విజయమ్మ... అమ్మ కన్నీరు తుడిచిన జగన్

Webdunia
గురువారం, 30 మే 2019 (15:30 IST)
తన కుమారుడు వైఎస్. జగన్ మోహన్ రెడ్డి నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన క్షణాల్లో ఆయన తల్లి వైఎస్. విజయమ్మ భావోద్వేగానికి లోనై కన్నీరు కార్చారు. దీంతో జగన్ తల్లి విజయమ్మ కన్నీరు తుడిచారు. ఈ దృశ్యం టీవీల్లో పదేపదే చూపిస్తున్నారు. 
 
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గురువారం మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రమాణం స్వీకారం చేయించారు. 
 
ఆ తర్వాత అనంతరం జగన్ రాష్ట్ర ప్రజానీకాన్ని ఉద్దేశించి ఆవేశపూరితంగా ప్రసంగించారు. ప్రసంగం ముగిసిన వెంటనే జగన్ రెండు చేతులు జోడించి అందరికీ నమస్కారం పెడుతుండడాన్ని చూసి తల్లి విజయమ్మ తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. జగన్ మాట్లాడుతున్నంతసేపు పట్టి ఉంచిన కన్నీటిని ఆపుకోలేక ఒక్కసారిగా జగన్‌‌ను హత్తుకుని ఏడ్చేశారు. 
 
అదేసమయంలో కార్యక్రమానికి హాజరైన ప్రజానీకం కూడా సీఎం సీఎం అంటూ నినాదాలతో హోరెత్తిస్తుండగా, జగన్ తల్లి కన్నీళ్లను తుడిచి అతిథులను సాగనంపుదాం రామ్మా అంటూ తోడ్కొని వెళ్లారు. సభలో అప్పటివరకు కనిపించిన ఆవేశపూరిత వాతావరణంలో విజయమ్మ చూపించిన పుత్రవాత్సల్యం అందరి కళ్లను చెమర్చేలా చేసింది. అసలైన పుత్రోత్సాహం విజయమ్మతో కనిపించింది. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments