భర్తతో పిల్లలు కన్నావుగా.. బావకు సంతాన భాగ్యం కల్పించు.. కోడలిపై అత్తామామల ఒత్తిడి

ఠాగూర్
శుక్రవారం, 31 అక్టోబరు 2025 (21:34 IST)
కట్టుకున్న భర్తతో పిల్లలు పుట్టించుకున్నావు.. ఇపుడు పిల్లలు లేని బావకు కూడా సంతాన భాగ్యం కల్పించాలంటూ ఇంటికొడలిపై అత్తామామలు తీవ్రంగా ఒత్తిడి చేస్తూ వేధింపులకు పాల్పడ్డారు. అయితే, ఆ వివాహిత అందుకు అంగీకరించకపోవడంతో అత్తామామలు కలిసి ఆమెను ఓ గదిలో బంధించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ మహిళను రక్షించి మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ అమానవీయ ఘటన ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెంలో వెలుగు చూసింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, పోలవరానికి చెందిన ఓ యువతికి జంగారెడ్డి గూడెంకు చెందిన ఓ యువకుడితో రెండేళ్ళ క్రితం వివాహమైంది. ఆమె ఓ యేడాది క్రితం ఓ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే భర్త సోదరుడికి పిల్లలు లేకపోవడంతో అతడితో కలిసి వారసుడికి జన్మనివ్వాలని అత్తమామలు ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఆమె భర్తను మరో ఊరికి పంపించి వివాహితను చిత్రహింసలకు గురిచేశారు. 
 
బిడ్డతో సహా గదిలో బంధించి మంచినీరు, భోజన పెట్టకుండా చిత్రహింసలకు గుర్తి చేశారు. దీనిపై సమాచారం తెలుసుకున్న బాధితురాలి తల్లిదండ్రులు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రతినిధులు, పోలీసుల సాయంతో కలిసి జంగారెడ్డి గూడెంకు వచ్చి తలుపులు బద్ధలుకొట్టి వివాహితను బయటకు తీసుకొచ్చారు. అలాగే, నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

తర్వాతి కథనం
Show comments