టీడీపీ నేత సుజనా చౌదరిని టార్గెట్ చేసిన ఈడీ

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (10:54 IST)
కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిని కేంద్రం కనుసన్నల్లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు టార్గెట్ చేశారు. సుజనా చౌదరికి చెందిన కంపెనీల్లో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ముఖ్యంగా, సుజానా గ్రూప్‌కు చెందిన నాగార్జున హిల్స్‌లో ఈ సోదాలు సాగుతున్నాయి. 
 
హైదరాబాద్ పంజాగుట్టలోని నాగార్జున హిల్స్ కంపెనీలపై చెన్నై నుంచి వచ్చిన ఈడీ బృందం సుమారు 12 గంటల నుంచి విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్ లిమిటెడ్, సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ కంపెనీలతోపాటు జూబ్లీహిల్స్‌లోని సుజనా నివాసంలో ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహిస్తున్నారు. 
 
కాగా, ఇటీవల టీడీపీకి చెందిన మరో రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత సీఎం రమేష్ కంపెనీలతో పాటు.. సీఆర్డీఏ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు కంపెనీల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెల్సిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ సర్కారు సీబీఐ ప్రవేశంపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా సంచలనమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Yuzvendra Chahal: తన భార్య హరిణ్య కు సర్‌ప్రైజ్ ఇచ్చిన రాహుల్ సిప్లిగంజ్

Rajamouli: వారణాసి కథపై రాజమౌళి విమర్శల గురించి సీక్రెట్ వెల్లడించిన వేణుస్వామి !

Thaman: సంగీతంలో విమర్శలపై కొత్తదనం కోసం ఆలోచనలో పడ్డ తమన్ !

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments