Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీడీపీ నేత సుజనా చౌదరిని టార్గెట్ చేసిన ఈడీ

Webdunia
శనివారం, 24 నవంబరు 2018 (10:54 IST)
కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిని కేంద్రం కనుసన్నల్లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు టార్గెట్ చేశారు. సుజనా చౌదరికి చెందిన కంపెనీల్లో ఈడీ, ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ముఖ్యంగా, సుజానా గ్రూప్‌కు చెందిన నాగార్జున హిల్స్‌లో ఈ సోదాలు సాగుతున్నాయి. 
 
హైదరాబాద్ పంజాగుట్టలోని నాగార్జున హిల్స్ కంపెనీలపై చెన్నై నుంచి వచ్చిన ఈడీ బృందం సుమారు 12 గంటల నుంచి విస్తృతంగా తనిఖీలు చేస్తోంది. స్ప్లెండిడ్ మెటల్ ప్రొడక్ట్ లిమిటెడ్, సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ కంపెనీలతోపాటు జూబ్లీహిల్స్‌లోని సుజనా నివాసంలో ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహిస్తున్నారు. 
 
కాగా, ఇటీవల టీడీపీకి చెందిన మరో రాజ్యసభ సభ్యుడు, సీనియర్ నేత సీఎం రమేష్ కంపెనీలతో పాటు.. సీఆర్డీఏ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు కంపెనీల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు చేసిన విషయం తెల్సిందే. దీంతో ఆంధ్రప్రదేశ్ సర్కారు సీబీఐ ప్రవేశంపై నిషేధం విధించింది. ఈ నిర్ణయం దేశ వ్యాప్తంగా సంచలనమైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vijay: విజయ్ దేవరకొండ చిత్రం కింగ్ డమ్ కు టికెట్ల పెంపు పై సందిగ్థ

బ్రాట్ లో యుద్ధమే రానే పాటను సిద్ శ్రీరామ్ అద్భుతంగా పాడారు : డాక్టర్ నరేష్ వికే

Varun Sandesh: వన్ వే టికెట్ టైటిల్ బాగా నచ్చింది : వరుణ్ సందేశ్

Tarun Bhaskar:: సినిమాలకు ఎప్పుడూ హద్దులుండకూడదు : తరుణ్ భాస్కర్

మైసా చిత్రంలో గోండ్ మహిళగా రష్మిక మందన్న - నేడు కీలకసన్నివేశాల చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments