Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందస్తు చర్యలే ప్రాణ నష్టం తగ్గించాయి.. ఏపీ హోం మంత్రి

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (08:41 IST)
కృష్ణానది వరద ముంపు బాధితులను ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆమె అధికారులకు ఆదేశించారు.
 
గుంటూరు జిల్లా కొల్లూరు మండల పరిషత్‌ కార్యాలయంలో వరదలపై జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. వరదప్రభావంతో కృష్ణాజిల్లాలో 34 గ్రామాలు, గుంటూరు జిల్లాలో 53 గ్రామాలు దెబ్బతిన్నాయన్నారు. 
 
రెండు జిల్లాల్లో కలిపి ఇద్దరు చనిపోయారని.. ముందస్తు చర్యలు తీసుకున్నందునే ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగామని మంత్రి పేర్కొన్నారు. కృష్ణాలో 2,239 ఎకరాలు, గుంటూరులో 2,470 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. 
 
పంట నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. వరద సహాయక చర్యల పురోగతిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం లంక గ్రామాల్లో ప్రజలకు మంచినీరు, ఆహారం, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

విజయ్ ఆంటోని మేకింగ్ అంటే చాలా ఇష్టం : మార్గన్ ఈవెంట్‌లో సురేష్ బాబు

Niharika: నిహారిక కొణిదెల సినిమాలో సంగీత్ శోభన్ సరసన నయన్ సారిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం
Show comments