Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందస్తు చర్యలే ప్రాణ నష్టం తగ్గించాయి.. ఏపీ హోం మంత్రి

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (08:41 IST)
కృష్ణానది వరద ముంపు బాధితులను ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆమె అధికారులకు ఆదేశించారు.
 
గుంటూరు జిల్లా కొల్లూరు మండల పరిషత్‌ కార్యాలయంలో వరదలపై జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. వరదప్రభావంతో కృష్ణాజిల్లాలో 34 గ్రామాలు, గుంటూరు జిల్లాలో 53 గ్రామాలు దెబ్బతిన్నాయన్నారు. 
 
రెండు జిల్లాల్లో కలిపి ఇద్దరు చనిపోయారని.. ముందస్తు చర్యలు తీసుకున్నందునే ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగామని మంత్రి పేర్కొన్నారు. కృష్ణాలో 2,239 ఎకరాలు, గుంటూరులో 2,470 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. 
 
పంట నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. వరద సహాయక చర్యల పురోగతిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం లంక గ్రామాల్లో ప్రజలకు మంచినీరు, ఆహారం, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: అల్లు అర్జున్ సినిమా కోసం రెక్కీ చేస్తున్న దర్శకుడు అట్లీ

4 రోజుల్లో 15.41 కోట్ల గ్రాస్ వసూళ్లు దక్కించుకున్న లిటిల్ హార్ట్స్

Siddhu: సిద్ధు జొన్నలగడ్డ, శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా తెలుసు కదా విడుదల తేదీ ఫిక్స్

గత ఏడాది డిసప్పాయింట్ చేసింది, విఎఫ్ఎక్స్ ఇన్ హౌస్ లో చేయడంతో కంట్రోల్ వుంది : టిజి విశ్వప్రసాద్

Roshan: రోషన్ ఛాంపియన్‌లో మలయాళ నటి అనస్వర రాజన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

ఫిలడెల్ఫియా నాట్స్ అక్షయపాత్ర ఆధ్వర్యంలో గణేశ్ మహా ప్రసాదం

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

తర్వాతి కథనం
Show comments