Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముందస్తు చర్యలే ప్రాణ నష్టం తగ్గించాయి.. ఏపీ హోం మంత్రి

Webdunia
సోమవారం, 19 ఆగస్టు 2019 (08:41 IST)
కృష్ణానది వరద ముంపు బాధితులను ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని ఏపీ హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. ప్రస్తుతం వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆమె అధికారులకు ఆదేశించారు.
 
గుంటూరు జిల్లా కొల్లూరు మండల పరిషత్‌ కార్యాలయంలో వరదలపై జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, వేమూరు ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. వరదప్రభావంతో కృష్ణాజిల్లాలో 34 గ్రామాలు, గుంటూరు జిల్లాలో 53 గ్రామాలు దెబ్బతిన్నాయన్నారు. 
 
రెండు జిల్లాల్లో కలిపి ఇద్దరు చనిపోయారని.. ముందస్తు చర్యలు తీసుకున్నందునే ప్రాణ నష్టాన్ని తగ్గించగలిగామని మంత్రి పేర్కొన్నారు. కృష్ణాలో 2,239 ఎకరాలు, గుంటూరులో 2,470 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. 
 
పంట నష్టాన్ని అంచనా వేసి బాధిత రైతులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. వరద సహాయక చర్యల పురోగతిని ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్నామని వెల్లడించారు. ప్రస్తుతం లంక గ్రామాల్లో ప్రజలకు మంచినీరు, ఆహారం, ఇతర సదుపాయాలు కల్పిస్తున్నామని వివరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sapthagiri: పెళ్లి కాని ప్రసాద్ ట్రైలర్ వచ్చేసింది

ఛాంపియన్ లో ఫుట్‌బాల్ ఆటగాడిగా రోషన్ బర్త్ డే గ్లింప్స్

నాని బేనర్ లో తీసిన కోర్ట్ సినిమా ఎలా వుందో తెలుసా.. కోర్టు రివ్యూ

Nani: నాని మాటలు మాకు షాక్ ను కలిగించాయి : ప్రశాంతి తిపిర్నేని, దీప్తి గంటా

'ఎస్ఎస్ఎంబీ-29' షూటింగుతో పర్యాటక రంగానికి గొప్ప గమ్యస్థానం : ఒరిస్సా డిప్యూటీ సీఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

Mutton: మటన్ రోజుకు ఎంత తినాలి.. ఎవరు తీసుకోకూడదో తెలుసా?

Garlic fried in ghee- నేతితో వేయించిన వెల్లుల్లిని తింటే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments