Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ రిలీజ్

Webdunia
బుధవారం, 30 జులై 2014 (20:18 IST)
ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 7 నుండి 23 వరకు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించడం జరుగుతుంది. ఎంసెట్ కౌన్సెలింగ్ కోసం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 57 కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. ఒకటి నుంచి ఐదు వేల ర్యాంక్ లోపు వారి సర్టిఫికెట్లను మొదటి రోజు పరిశీలిస్తారు. 
 
ఇంజినీరింగ్ కౌన్సిలింగ్‌కు 2,15, 336 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. కాగా, ఉన్నత విద్యా మండలి విడుదల చేసే నోటిఫికేషన్‌తో తమకు సంబంధం లేదని ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేగాకుండా తెలంగాణ ప్రభుత్వం 1956కు ముందు నుంచి తెలంగాణలో స్థిరపడినవారికే 'ఫాస్ట్' పథకం వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, ఈ పథకం విధి విధానాలు ఖరారు చేసేందుకు ఐదుగురు అధికారులతో కమిటీని నియమించింది. 
 
స్థానిక నిర్ధారించే ధృవపత్రాలను రెవెన్యూశాఖ జారీ చేస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఫీజు రీఎంబర్స్‌మెంట్ పేరు మార్చి 'ఫైనాన్పియల్ అసిస్టెంట్ ఫర్ స్టూడెంట్స్(ఫాస్ట్)' పేరుతో కొత్త స్కీమ్‌ను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments