ఏపీ డీఎస్సీ 2014 నోటిఫికేషన్ను జారీ చేసినట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 9061 పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. ఇందులో 1949 పోస్టులు స్కూల్ అసిస్టెంట్లు, 812 భాషా పండితులు, 156 పీఈటీ, 6244 ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి.
ఈ పోస్టులకు డిసెంబర్ 3 నుంచి జనవరి 17 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 9, 10, 11 తేదీల్లో ఉపాధ్యాయ నియామక పరీక్షలు జరుగుతని చెప్పారు. జూన్ 28న ఉపాధ్యాయ నియామక రాత పరీక్షలు జరుగుతాయని తెలిపారు.
మరోవైపు.. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా విడుదల చేసిన డీఎస్సీ-2014 నోటీఫికేషన్ షెడ్యూల్ అస్పష్టంగా ఉందని పలువురి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. డీఎస్సీతో పాటు టెట్ పరీక్షను కూడా ఒకేసారి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థుల్లో అయోమయం నెలకొంది.
తాజా డీఎస్సీ నోటిఫికేషన్ షెడ్యూల్తో గతంలో టెట్ అర్హులైన వారు కూడా మరోసారి పరీక్ష రాయాల్సి ఉండటంతో గందరగోళానికి తావిస్తోంది. అయితే టెట్ పరీక్షల్లో వెయిటేజీ ఆధారంగానే డీఎస్సీ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.