కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్తున్నారా? తస్మాత్ జాగ్రత్త. కార్పొరేట్ ఆస్పత్రులకు చెందిన ఫార్మసీల్లో అమ్మబడే మందుల్లో నాణ్యత లోపించిందని డ్రగ్ కంట్రోల్ అధికారులు చెబుతున్నారు.
హైదరాబాద్లోని 11 కార్పొరేట్ ఆస్పత్రులపై డ్రగ్ కంట్రోల్ అధికారులు మంగళవారం ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆరు ఆస్పత్రులపై కేసులు నమోదు చేశారు.
లైసెన్స్ లేకుండా మందులు అమ్ముతున్న రెండు గోడౌన్లు సీజ్ చేశారు. అధిక బిల్లులు, గడువు దాటిన మందులు విక్రయిస్తున్నారని అధికారులు గుర్తించారు. ఆస్పత్రిలో లోపాలను సరిచేసుకోవాలని నోటీసులు జారీ చేశారు. అలాగే ఫార్మసీలు సరిగ్గా రికార్డు మెయింటైన్ చేయట్లేదని అధికారులు వెల్లడించారు.