Webdunia - Bharat's app for daily news and videos

Install App

28న రాష్ట్రపతి చేతుల మీదుగా ఎన్టీఆర్ 100 రూపాయల నాణేం

Webdunia
శనివారం, 26 ఆగస్టు 2023 (09:59 IST)
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, నటుడు ఎన్టీఆర్- నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా ఆయన స్మారకార్థం ఈ నెల 28న ఆర్బీఐ 100 రూపాయల నాణేన్ని విడుదల చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ ప్రత్యేక నాణేన్ని రాష్ట్రపతి భవన్‌లో విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబుతో పాటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి నందమూరి కుటుంబ సభ్యులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి. 
 
ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఎన్టీఆర్ నాణెం తయారు చేసింది. ఎన్టీఆర్ ముఖంతో నాణేల విడుదల కార్యక్రమం నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఢిల్లీకి వెళ్లనున్నారు. 
 
ఆగస్టు 28న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ వంద రూపాయల నాణేన్ని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments