Webdunia - Bharat's app for daily news and videos

Install App

జంగారెడ్డిగూడెంలో ఫైనాన్షియర్ దంపతులను గొడ్డలితో నరికి చంపేశారు!

Webdunia
శుక్రవారం, 21 నవంబరు 2014 (15:27 IST)
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఫైనాన్షియర్ దంపతులను గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలితో అత్యంత కిరాతకంగా నరికి చంపేశారు. గురువారం అర్థరాత్రి జరిగిన ఈ జంట హత్యలు స్థానికంగా కలకలం సృష్టించింది. విజయ పేరుతో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న లక్ష్మణరావును కొంతమంది దుండగులు పెట్రోల్ బంక్ సమీపంలో అడ్డగించి గొడ్డలితో నరికారు. 
 
తన భర్తకు జరిగిన ప్రమాదాన్ని పసిగట్టిన ఆయన భార్య తులసి.. హంతకులను అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో ఆమెను కూడా వారు నరికి చంపేశారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందోళనలు గురయ్యారు. 
 
ఈ జంట హత్యలకు పాత కక్షలే ప్రధాన కారణం కావచ్చని అనుమానిస్తున్నారు. దీనిపై సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ దారుణం గురువారం అర్థిరాత్రి దాటాక జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments