Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీలో చేరిన తర్వాత జగన్ రాజకీయ అత్యాచారం చేస్తారు : డొక్కా మాణిక్యవరప్రసాద్

ఠాగూర్
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (16:36 IST)
ఏపీ మాజీ మంత్రి, ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరారు. ఈ చేరికపై మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ తన స్పందన తెలియజేశారు. పార్టీలో చేరిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ అత్యాచారం చేస్తారంటూ కామెంట్స్ చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఒక మిత్రుడుగా శైలజనాథ్‌కు ఓ సలహా ఇవ్వాలనుకుంటున్నానని, వైకాపాలో విలువలు, విశ్వసనీయతలు ఉండవని పార్టీలో చేర్చుకునే ముందు ఎంతో ఆప్యాయంగా ఉంటారని, చేరిన తర్వాత జగన్ రాజకీయ అత్యాచారం చేస్తారని తెలిపారు. 
 
వైకాపాలో ఇప్పటికే 74 మంది నేతలు ఎన్నో ఇబ్బందులుపడ్డారని డొక్కా అన్నారు. దళితులకు ఆ పార్టీలో విలువ ఉండదని చెప్పారు. దళితులకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ వైకాపా అని వ్యాఖ్యానించారు. శైలజానాథ్‌కు రాజకీయ భవిష్యత్ ఉండాలంటే ఆ పార్టీలో చేరకపోవడమే మంచిదని సూచించారు.
 
కాగా, శింగనమల వైకాపా ఇన్‌చార్జ్‌గా శైలజానాథ్ పేరును ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది. గత 30 యేళ్లుగా ఇదే సెంటిమెంట్ కొనసాగుతుండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో కుబేర - రష్మిక మందన్న న్యూ లుక్

Srileela: జాన్వీకపూర్ ప్లేస్ లో శ్రీలీల - కారణం డేటింగేనా ?

కన్నప్ప కోసం ఫైట్ మాస్టర్ గా మారిన మంచు విష్ణు

Samantha: కొత్త జర్నీ ప్రారంభం.. రాజ్ నిడిమోరుతో సమంత ఫోటో

Shobhan Babu: గిన్నిస్ రికార్డ్ సాధించిన సోగ్గాడు శోభన్ బాబు మనవడు సురక్షిత్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Budget Friendly Foods: గుండె ఆరోగ్యానికి బడ్జెట్ ఫ్రెండ్లీ ఆహారాలేంటి?

పేదల ఆకలి తీర్చే సంస్థకు నాట్స్ విరాళం, ఫిలడెల్ఫియా నాట్స్ విభాగం దాతృత్వం

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

తర్వాతి కథనం
Show comments