Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీలో చేరిన తర్వాత జగన్ రాజకీయ అత్యాచారం చేస్తారు : డొక్కా మాణిక్యవరప్రసాద్

ఠాగూర్
శుక్రవారం, 7 ఫిబ్రవరి 2025 (16:36 IST)
ఏపీ మాజీ మంత్రి, ఏపీ పీసీసీ మాజీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జగన్ పార్టీలో చేరారు. ఈ చేరికపై మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ తన స్పందన తెలియజేశారు. పార్టీలో చేరిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్ రాజకీయ అత్యాచారం చేస్తారంటూ కామెంట్స్ చేశారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఒక మిత్రుడుగా శైలజనాథ్‌కు ఓ సలహా ఇవ్వాలనుకుంటున్నానని, వైకాపాలో విలువలు, విశ్వసనీయతలు ఉండవని పార్టీలో చేర్చుకునే ముందు ఎంతో ఆప్యాయంగా ఉంటారని, చేరిన తర్వాత జగన్ రాజకీయ అత్యాచారం చేస్తారని తెలిపారు. 
 
వైకాపాలో ఇప్పటికే 74 మంది నేతలు ఎన్నో ఇబ్బందులుపడ్డారని డొక్కా అన్నారు. దళితులకు ఆ పార్టీలో విలువ ఉండదని చెప్పారు. దళితులకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ వైకాపా అని వ్యాఖ్యానించారు. శైలజానాథ్‌కు రాజకీయ భవిష్యత్ ఉండాలంటే ఆ పార్టీలో చేరకపోవడమే మంచిదని సూచించారు.
 
కాగా, శింగనమల వైకాపా ఇన్‌చార్జ్‌గా శైలజానాథ్ పేరును ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది. ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేక ఉంది. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలిస్తే ఆ పార్టీనే అధికారంలోకి వస్తుంది. గత 30 యేళ్లుగా ఇదే సెంటిమెంట్ కొనసాగుతుండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్లీజ్.. మాజీ భార్య అని పిలవొద్దు : రెహ్మాన్ సతీమణి సైరా

సమంతకు మళ్లీ ఏమైంది? అభిమానుల్లో టెన్షన్.. టెన్షన్

డీహైడ్రేషన్ వల్లే ఏఆర్ రెహ్మన్ అస్వస్థతకు లోనయ్యారు : వైద్యులు

హైలెట్ అవ్వడానికే కమిట్మెంట్ పేరుతో బయటకు వస్తున్నారు : అన్నపూర్ణమ్మ

ఏఆర్ రెహ్మాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో అడ్మిట్ : స్పందించిన సోదరి ఫాతిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

తర్వాతి కథనం
Show comments