Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్యాండేజ్ క్లాత్, దూదిని కడుపులో ఉంచి కుట్టువేశారు... ఎక్కడ?

వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణంబలైంది. సర్జరీ సమయంలో వైద్యుల అజాగ్రత్త వల్ల బ్యాండేజ్ క్లాత్, దూదిని కడుపులో ఉంచి కుట్లు వేశారు. దీంతో కొన్ని రోజుల తర్వాత ఆమె పేగులు విషపూరితం కావడంతో మహిళ మృతి

Webdunia
బుధవారం, 11 జులై 2018 (08:28 IST)
వైద్యుల నిర్లక్ష్యానికి ఓ నిండు ప్రాణంబలైంది. సర్జరీ సమయంలో వైద్యుల అజాగ్రత్త వల్ల బ్యాండేజ్ క్లాత్, దూదిని కడుపులో ఉంచి కుట్లు వేశారు. దీంతో కొన్ని రోజుల తర్వాత ఆమె పేగులు విషపూరితం కావడంతో మహిళ మృతి చెందింది. ఈ సంఘటన  రంగారెడ్డి జిల్లాలో జరిగింది.
 
జిల్లాలోని షాబాద్‌ మండలం అప్పారెడ్డిగూడకు చెందిన హరిత అనే మహిళ నిండు గర్భిణి. ఈమె గత 2017 అక్టోబరు 3వ తేదీన ప్రసవ నొప్పులతో స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరింది. అయితే, సిజేరియన్ ఆపరేషన్ ద్వారా మాత్రమే కాన్పు చేయాల్సి ఉంటుందని వైద్యులు చెప్పారు. 
 
దీంతో ఆపరేషన్‌కు వారు సమ్మతించారు. ఆ తర్వాత సర్జరీ ముగిసిన తర్వాత పొరపాటున కడుపులో బ్యాండేజీ క్లాత్‌, దూదిని ఉంచి కుట్లు వేశారు. కొన్ని రోజుల తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఉస్మానియా పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ మే 27వ తేదీన శస్త్రచికిత్స చేసి కడుపులోంచి బ్యాండేజీ క్లాత్‌‌ను, ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించారు. 
 
అయితే, అప్పటికే పేగులు విషపూరితం కావడం వల్ల గత నెల 15వ తేదీ ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ప్రైవేటు ఆస్పత్రి డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల తన సోదరి మృతి చెందిందని.. ఆమె సోదరుడు రవి మానవహక్కుల సంఘంలో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు రంగారెడ్డి ఆరోగ్యశాఖ జిల్లా కోఆర్డినేటర్‌‌కు హెచ్ఆర్సీ నోటీసుల జారీ చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థియేటర్స్‌కి రమ్మని ఆడియన్స్‌ని రిక్వెస్ట్ చేస్తున్నా : త్రినాథరావు నక్కిన

ప్రియదర్శి, ఆనంది, సుమ కనకాల చిత్రం ప్రేమంటే థ్రిల్లింగ్ షెడ్యూల్ పూర్తి

సుధీర్ అత్తవర్ చిత్రం కొరగజ్జ తో ప్రయోగం చేయబోతున్న గోపీ సుందర్

గోపీచంద్‌, మీనాక్షి దినేష్ జంటగా బీవీఎస్ఎన్ ప్రసాద్ చిత్రం

Imanvi : నేను భారతీయ అమెరికన్‌ని, నా వాళ్ళు ఎవరూ సైన్యంలో లేరు : ఇమాన్వి స్పష్టీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌ కొండాపూర్‌లో 3వ స్టోర్‌ను ప్రారంభించిన టిబిజెడ్-ది ఒరిజినల్

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

Tulsi for Skin: తులసి ఆకులతో చర్మ సౌందర్యం.. పైసా ఖర్చు లేకుండా మెరిసిపోవచ్చు..

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

తర్వాతి కథనం
Show comments