Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సీఎం జగన్‌కు కరోనా పరీక్షలు... ఎందుకంటే?

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (19:58 IST)
corona test to jagan
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలూ తీసుకుంటోంది. ముఖ్యంగా, కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల కోసం అధునాతన కిట్స్‌ను కూడా ఉపయోగిస్తోంది. తాజాగా సౌత్ కొరియా నుంచి లక్ష కిట్స్‌ను దిగుమతి కూడా చేయించుకుంది. 
 
ఈ కిట్లను ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఆ తర్వాత ఆదే కిట్లను ఉపయోగించి ముఖ్యమంత్రి జగన్‌కు వైద్యులు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో నెగెటివ్ అని వచ్చింది. 
 
ఈ ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ సాయంతో కేవలం 10 నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించవచ్చు. ఈ కిట్లను జిల్లాలకు పంపి సామూహిక పరీక్షలు చేపట్టాలన్నది ప్రభుత్వ యోచన. తద్వారా కరోనా వ్యాప్తిని త్వరితగతంగా అరికట్టవచ్చని ఏపీ సర్కారు భావిస్తోంది.

సంబంధిత వార్తలు

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments