Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై హెచ్ఐవీ రక్తం చల్లిన డాక్టర్.. ఎక్కడ?

కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై అదే ఆస్పత్రిలో పని చేసే వైద్యుడు ఒకడు హెచ్ఐవీ రక్తాన్ని చల్లాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వ

Webdunia
ఆదివారం, 20 ఆగస్టు 2017 (10:07 IST)
కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌పై అదే ఆస్పత్రిలో పని చేసే వైద్యుడు ఒకడు హెచ్ఐవీ రక్తాన్ని చల్లాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో డేవిడ్ రాజ్ అనే వ్యక్తి ఎముకల వైద్య నిపుణుడు (ఆర్థోపెడీషియన్)గా పనిచేస్తున్నాడు. అలాగే, ఆస్పత్రి సూపరింటెండెంట్‌‌గా లక్ష్మీ ప్రసాద్‌ కొనసాగుతున్నారు. ఆస్పత్రి తనిఖీల్లో భాగంగా, సూపరింటెండెంట్ రాత్రిపూట వార్డులో రౌండ్లు నిర్వహిస్తూ పర్యవేక్షించేవారు.
 
ఇలా రౌండ్లు నిర్వహిస్తున్న సమయంలో లక్ష్మీ ప్రసాద్‌పై డేవిడ్ రాజ్ హెచ్‌వీఐ కలిగిన రక్తాన్ని స్ప్రే చేశాడు. అయితే ఆ రక్తాన్ని ఇంజెక్ట్ చేయకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
 
ఈ విచారణలో సూపరింటెండెంట్‌పై రక్తాన్ని చిమ్మినట్టు డేవిడ్ రాజ్ అంగీకరించాడు. తనను లాంగ్‌లీవ్‌పై ఆసుపత్రి నుంచి వెళ్లమని చెప్పడంతో అతడిని భయపెట్టాలనే అలా చేసినట్టు వివరించాడు. ఈ ఘటనపై ఆసుపత్రి సేవల జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ జయరాజ్ విచారణకు ఆదేశించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Malavika: గ్లామరస్‌ రోల్స్‌ చేయవద్దనే రూల్ పెట్టుకోలేదు : మాళవిక మనోజ్‌

Nabha : ఎలీ ఇండియా జూలై మేగజైన్ కవర్ పైజీపై నభా నటేష్

Natti: చిన్న సినిమాకు 2-30 గంటల షో కేటాయించాలి : నట్టి కుమార్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments