Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త సంవత్సర వేడుకలొద్దు.. నన్ను కలవడానికి రావద్దు.. చింతకాయల అయ్యన్న

సెల్వి
మంగళవారం, 31 డిశెంబరు 2024 (11:48 IST)
Ayyanna Patrudu
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు నూతన సంవత్సర వేడుకలకు ముందు కీలక ప్రకటన చేశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి తనను ఎవరూ వ్యక్తిగతంగా కలవవద్దని అభ్యర్థించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళిగా కేంద్ర ప్రభుత్వం ఏడు రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించింది.
 
ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరపు వేడుకలకు ఆతిథ్యం ఇవ్వడం లేదా అందులో పాల్గొనడం సరికాదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు నిర్ణయించారు. అంతేగాకుండా నూతన సంవత్సర శుభాకాంక్షల కోసం జనవరి 1న తనను వ్యక్తిగతంగా కలవడం శుభాకాంక్షలు తెలపడం మానుకోవాలని కోరారు. 
 
మరోవైపు మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు భారత రత్న ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసింది. దేశాన్ని ప్రపంచంతో పోటీపడేలా చేసిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అంటూ కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ ప్రధాని మన్మోహన్‌తో తెలంగాణకు ఉన్న బంధం ఎప్పటికీ మరిచిపోలేనిదన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments