Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిజెలు, ర్యాలీలు, మ‌ద్యం...ఏవి క‌నిపించినా అరెస్టే!

Webdunia
శనివారం, 18 సెప్టెంబరు 2021 (20:01 IST)
ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు జెడ్ పి టి సి, ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ కొన్ని ఆదేశాలను జారీ చేశార‌ని అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు పోలీసులు అల్టిమేటం జారీ చేశారు. 
 
ఎన్నికల కౌంటింగ్ దృష్ట్యా ప్రజలు ఎవరు రోడ్లపై గుమిగూడి ఉండరాద‌ని, కౌంటింగ్ సెంటర్ కు వెళ్ళే  అభ్యర్థులు తగిన గుర్తింపు కార్డులతో రావాల‌ని చెప్పారు. అభ్యర్థులు ఎటువంటి ఊరేగింపులు చేయ‌డం గాని, బాణా సంచాలు కాల్చ‌డానికి గాని అనుమతులు లేవ‌న్నారు. కౌంటింగ్ సెంటర్ వద్ద గుంపులు గుంపులుగా తిరగరాద‌ని, ఎన్నికలు నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వులను అతిక్రమించి మద్యం  బాటిల్స్ కలిగి ఉండరాద‌న్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసు వారు తీసుకొను చర్యలకు ప్రజలు అందరూ సహకరించాల‌ని డిఎస్పీ తెలిపారు.

ర్యాలీలు నిర్వహించుటకు ఎలాంటి అనుమతులు లేవ‌ని, అలాగే, రేపు వినాయక నిమజ్జనం చేసే భక్తులు సాంప్రదాయబద్ధంగా ఎటువంటి అల్లర్లు లేకుండా  చేసుకోవాల‌ని సూచించారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు పాటించాల‌ని, పై నిబంధనలు అతిక్రమించిన వారిపై పోలీస్ వారు చట్టరీత్యా తగు చర్యలు తీసుకుంటార‌ని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' నుంచి క్రేజీ అప్‌డేట్!

ఎఫ్ఎన్ సీసీ లీజు విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : దిల్ రాజు

Pradeep: పబ్లిసిటీకి ప్లస్ అవుతుందనే పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టాం : డైరెక్టర్స్ నితిన్ & భరత్

పాము నేపథ్యంలో ఫణి మోషన్ పోస్టర్ లాంఛ్ చేసిన కె రాఘవేంద్రరావు

Dil Raju: శిరీష్ కొడుకు ఆశిష్ హీరోగా దిల్ రాజు 60వ మూవీ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments