Webdunia - Bharat's app for daily news and videos

Install App

మృగాళ్లు రెచ్చిపోతుంటే మౌనం దాల్చడం సరికాదు, జగన్‌పై నారా లోకేశ్ ఫైర్

Webdunia
గురువారం, 15 అక్టోబరు 2020 (21:30 IST)
విజయవాడ క్రీస్తురాజపురానికి చెందిన దివ్య తేజస్విని అనే బీటెక్ విద్యార్థిని ఓ ప్రేమోన్మాది కిరాతకం కారణంగా కన్నుమూసింది. నాగేంద్రబాబు అలియాస్ స్వామి అనే యువకుడు దివ్య తేజస్వినిని గొంతుకోసి హత్య చేశాడు. దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
 
బంగారు భవిష్యత్తు ఉన్న దివ్య ఓ ప్రేమోన్మాది చేతిలో బలి కావడం దారుణమన్నారు. రాష్ట్రంలో మహిళలకు సరైన రక్షణ లేదని వరుస ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులు వ్యవధిలోనే అరడజనుకు పైగా ఘటనలు జరగడం ఆందోళకరమని తెలిపారు.
 
వరుసగా మృగాళ్లు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం మౌనం దాలుస్తున్నారు. చట్టరూపం దాల్చని దిశా చట్టం ఆర్భాటంగా ప్రారంభించిన దిశ పోలీసు స్టేషన్లు, అధికారం లేని హోంమంత్రి ఇక మహిళలకు న్యాయం జరిగేదెప్పుడు అంటూ నారా లోకేశ్ ట్విట్టర్లో స్పందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న స్కై మూవీ

గడపగడపకు ఆర్కే నాయుడు నుంచి విక్రాంత్ ఐపీఎస్ గా మారా : ఆర్‌కె సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments