Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజుపై అన‌ర్హ‌త‌ వేటు వేయండి

Webdunia
గురువారం, 8 జులై 2021 (14:28 IST)
ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు పై అన‌ర్హ‌త‌ వేటు వేయాల‌ని లోక్ స‌భ స్పీక‌ర్ ను వైసీపీ ఎంపీలు డిమాండు చేశారు. ఆర్.ఆర్.ఆర్. పై వేసిన అన‌ర్ష‌త నోటీస్‌ను వెంట‌నే అమ‌లు చేయాల‌ని లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాను గురువారం ఢిల్లీలో క‌లిసి విజ్ణ్న‌ప్తి చేశారు.

వైసీపీ ఎంపీలు విజ‌య‌సాయిరెడ్డి, మిధున్ రెడ్డి, మార్గాని భ‌ర‌త్ లు లోక్ స‌భ స్పీక‌ర్ తో స‌మావేశం అయ్యారు. ర‌ఘురామ కృష్ణంరాజు పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నార‌ని వివ‌రించారు. దానికి సంబంధించిన ఆధారాల‌ను ఓం బిర్లాకు స‌మర్పించారు. ఇక ఆయ‌న్ని ఉపేక్షించ‌వ‌ద్ద‌ని, వెంట‌నే ఎంపీ ర‌ఘురామ కృష్ణం రాజు లోక్ స‌భ స‌భ్య‌త్వాన్ని ర‌ద్దు చేయాల‌ని కోరారు.

అయితే, దీనికి రెండు రోజుల ముందే ఎంపీ ర‌ఘ‌రామ కృష్ణం రాజు లోక్ స‌భ స్పీక‌ర్ ఓం బిర్లాను క‌లిసిన సంగ‌తి విదిత‌మే. ఆయ‌నపై వైసీపీ ఇచ్చిన అన‌ర్హ‌త నోటీస్ చెల్ల‌ద‌ని, తాను పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాలు నిర్వ‌హించ‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు. తాను పార్టీలో, ప్ర‌భుత్వంలో జ‌రుగుతున్న కొన్ని ప‌రిణామాల‌ను ప్ర‌శ్నించినందుకే, త‌న‌పై పార్టీ వ‌ర్గాలే దాడి చేస్తున్నాయ‌ని ఆయ‌న స్పీక‌ర్ కు తెలియ‌జేసిన‌ట్లు స‌మాచారం. అయితే, ఇపుడు ముగ్గురు ఎంపీలు స్పీక‌ర్ ఓం బిర్లాను క‌లిసి, ర‌ఘు రామ‌కృష్ణంరాజుపై వేటు వేయాల‌ని కోర‌డంతో దీనిపై స్పీక‌ర్ ఏలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచి చూడాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుణ్ తేజ్ VT15 అనంతపూర్ షెడ్యూల్స్ పూర్తి, నెక్స్ట్ కొరియాలో

ఈ విజయ వైభవం మాకు చాలా ప్రత్యేకం: రుత్విక్, సాత్విక్

Pawan Kalyan: రిటర్న్ గిఫ్ట్ స్వీకారం... సినిమా రంగం కోసం ప్రత్యేక పాలసీ

క్రిష్ణ జయంతి సందర్భంగా 800 స్క్రీన్‌లలో ఖలేజా రీ-రిలీజ్

అసభ్యతలేని నిజాయితీ కంటెంట్‌తో తీసిన సినిమా నిలవే : హీరో సౌమిత్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Tea Bags- టీ బ్యాగుల్లో టీ సేవిస్తున్నారా?

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

Fish vegetarian: చేపలు శాకాహారమా? మాంసాహారమా?

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

Black Cumin Seed: నల్ల జీలకర్ర కషాయాన్ని మహిళలు తాగితే ఒబిసిటీ మటాష్

తర్వాతి కథనం
Show comments